బోరుబావిలో చిన్నారి.. బతికింది

పండగ పూట పెను విషాదం తప్పింది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా పరిగి లోగల గోవింద్‌పల్లి తండాలో ఆడుకుంటూ ఓ చిన్నారి బోరుబావిలో పడిపోయిన విషయం విదితమే. అధికారులు తక్షణం స్పందించడం, బాలిక బోరు బావిలో…

పండగ పూట పెను విషాదం తప్పింది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా పరిగి లోగల గోవింద్‌పల్లి తండాలో ఆడుకుంటూ ఓ చిన్నారి బోరుబావిలో పడిపోయిన విషయం విదితమే. అధికారులు తక్షణం స్పందించడం, బాలిక బోరు బావిలో తక్కువ లోతులోనే ఇరుక్కుపోవడంతో ఆమె ప్రాణాలు దక్కాయి. క్షేమంగా చిన్నారిని బయటకు తీసిన అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

తొలుత బాలిక పడ్డ బోరుబావిలోకి ఆక్సిజన్‌ని వదిలి, అనంతరం జాగ్రత్తగా బాలికను బయటకు తీసే ప్రయత్నాలు చేపట్టారు. వారి ప్రయత్నాలు సఫలమయ్యాయి. చిన్నారి నందిని ప్రాణాలతో బయటపడింది. బోరుబావిని మూసేయకుండా వదిలేసిన వారిపై చర్యలు తీసుకుంటామంటున్నారు అధికారులు.

గతంలో తెలంగాణలోనే ఓ బాలిక బోరుబావిలో పడి మృత్యువాత పడగా, తాజా ఘటనలో మాత్రం చిన్నారి నందిని మృత్యుంజయురాలిగా బోరుబావి ప్రమాదం నుంచి బయటపడింది.