Advertisement

Advertisement


Home > Movies - Movie News

అనుమానాలకు 'ఇస్మార్ట్'గా తెర

అనుమానాలకు 'ఇస్మార్ట్'గా తెర

డబుల్ ఇస్మార్ట్.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈపాటికి ఈ సినిమా థియేటర్లలోకొచ్చి అటుఇటుగా 2 నెలలయ్యేది. కానీ ఇప్పటివరకు షూటింగ్ కూడా పూర్తికాలేదు. ఆర్థిక సమస్యలు ఈ సినిమాను చుట్టుముట్టాయనే ఊహాగానాలు గుప్పుమన్నాయి. దీనికి కొనసాగింపుగా సినిమా షూటింగ్ ఆగిపోయిందని, ముందుకు కదిలే పరిస్థితి లేదంటూ వరుసగా పుకార్లు.

ఎట్టకేలకు ఈ పుకార్లకు తెరపడింది. డబుల్ ఇస్మార్ట్ కొత్త షెడ్యూల్ మొదలైంది. ఫ్రెష్ గా మరోసారి కొబ్బరికాయ కొట్టి మరీ షూటింగ్ స్టార్ట్ చేశారు. ముంబయిలో మొదలైన ఈ షెడ్యూల్ చాలా పెద్దదంటోంది యూనిట్. ఇదే చివరిదని మాత్రం చెప్పడం లేదు.

మొత్తానికి డబుల్ ఇస్మార్ట్ మళ్లీ పట్టాలెక్కింది. ప్రధాన తారాగణంపై ఈ షెడ్యూల్ లో మరిన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు. ఈ షెడ్యూల్ తో మేజర్ పార్ట్ షూట్ పూర్తవుతుందంట. కచ్చితంగా పూర్తవుతుంది, ఎందుకంటే అక్కడున్నది పూరి జగన్నాధ్.

రామ్ హీరోగా నటిస్తున్న ఈ సీక్వెల్ లో సంజయ్ దత్ విలన్ గా కనిపించబోతున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే మరిన్ని అప్ డేట్స్ ఇస్తామన్నారు కానీ సినిమా విడుదల తేదీ మాత్రం చెప్పలేదు. షూట్ కొలిక్కి వచ్చిన తర్వాతే రిలీజ్ డేట్ చెప్పడం బెటరని భావిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?