Advertisement

Advertisement


Home > Movies - Movie News

శ్రీదేవి ఇంట్లో గడిపే అద్భుత అవకాశం

శ్రీదేవి ఇంట్లో గడిపే అద్భుత అవకాశం

అతిలోకసుందరి శ్రీదేవికి చెన్నైలో బ్రహ్మాండమైన ఇల్లు ఉంది. సాగర తీరం కనిపించేలా ఉన్న ఆ ఇంటిలో ఆమెకు బోలెడన్ని జ్ఞాపకాలున్నాయి. బోనీ కపూర్ తో వివాహమైన తర్వాత ఆమె తన భర్తతో విహారం కోసం ఈ ఇంటికే వచ్చేవారు. అంతేకాదు, భర్తతో పాటు పిల్లల పుట్టినరోజులు కూడా ఈ ఇంట్లోనే నిర్వహించారు.

అలాంటి ఇంట్లో గడిపే అద్భుతమైన అవకాశం ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అవును.. తన తల్లి శ్రీదేవి కలల ఇంటిలో గడిపేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు జాన్వి కపూర్ ప్రకటించింది. ఈ మేరకు ఓ అమెరికన్ కంపెనీతో ఒప్పందం కూడా జరిగింది.

శ్రీదేవి ఇంట్లో గడపడానికి ఎలాంటి రుసం చెల్లించాల్సిన పని లేదు. ఇది పూర్తిగా ఉచితం. ఈ ఇంటిని సందర్శించడానికి, ఇందులో గడపడానికి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన నిబంధనల ప్రకారం అప్లికేషన్ నింపాల్సి ఉంటుంది. అలా వచ్చిన వాటి నుంచి కొందర్ని ఎంపిక చేసి వాళ్లకు గోల్డెన్ టికెట్ అందిస్తారు. ఆ టికెట్ తో వాళ్లు శ్రీదేవి ఇంట్లో ఉండొచ్చు.

నిజానికి ఈ ఇంటిని ఓ హోటల్ లేదా రిసార్ట్ గా మార్చాలనేది శ్రీదేవి ఆలోచన. అందుకే బోనీ కపూర్, జాన్వి కపూర్ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే అతిథులుగా వచ్చిన వాళ్లు దయచేసి తమ ఇంట్లో వస్తువులు దొంగిలించొద్దని జాన్వి కపూర్ కోరుతోంది. అందులో ఉన్న ప్రతి వస్తువు తన తల్లి జ్ఞాపకమని, ఆ జ్ఞాపకాల్ని తన నుంచి దూరం చేయొద్దని రిక్వెస్ట్ చేస్తోంది.

మొత్తమ్మీద శ్రీదేవి ఇంటిని ఇలా సందర్శించే అవకాశం కల్పించడం, పైగా దాన్ని ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడం మంచి విషయం. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?