Advertisement

Advertisement


Home > Politics - Andhra

జగన్ విజన్ కరెక్ట్ అంటున్న టీడీపీ ఎంపీ అభ్యర్ధి!

జగన్ విజన్ కరెక్ట్ అంటున్న టీడీపీ ఎంపీ అభ్యర్ధి!

విశాఖ ఏపీకి గ్రోత్ ఇంజన్ అవుతుంది అని గత నాలుగున్నరేళ్లుగా జగన్ చెబుతూనే ఉన్నారు. విశాఖ రెడీ మేడ్ సిటీ అని కాస్తా నిధులు వెచ్చిస్తే విశాఖ మంచి రాజధాని నగరం అవుతుందని ఆయన చెబుతూనే ఉన్నారు. హైదరాబాద్ తో పాటు దేశంలో ప్రధాన నగరాలతో పోటీ పడాలీ అంటే ఏపీలో ఉన్న ఏకైక నగరం విశాఖను వాడుకోవాల్సిందే అన్నది జగన్ మార్క్ విజన్.

అందుకే ఆయన తాను రేపటి రోజున రెండవసారి సీఎం అయ్యాక విశాఖలోనే ప్రమాణం చేస్తాను పాలన విశాఖ నుంచే చేస్తాను అని స్టేట్మెంట్ ఇచ్చారు. విశాఖ రాజధాని అన్న మాటకు టీడీపీ ఎక్కడా ఒప్పుకోవడం లేదు. అమరావతినే ఈ రోజుకీ టీడీపీ చూపిస్తూ ఉంది.

అది టీడీపీ కమిట్మెంట్. అయితే విశాఖ ఎంపీ అభ్యర్ధిగా టీడీపీ నుంచి పోటీ చేస్తున్న బాలయ్య చిన్నల్లుడు బాబుకు దగ్గర చుట్టం అయిన శ్రీ భరత్ ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను పంచుకున్నారు. విశాఖని ఏపీకి గ్రోత్ ఇంజన్ గా ఆయన కూడా చెప్పారు.

అమరావతికి ఒక రూపు రావాలంటే చాలా టైం పడుతుందని శ్రీ భరత్ అనడం విశేషం. విశాఖను అభివృద్ధి చేసుకుంటే  ఏపీకి అన్ని విధాలుగా బాగుంటుందని ఆయన అంటున్నారు. దీంతో టీడీపీకి ఇది షాకింగ్ పరిణామంగా మారింది అని అంటున్నారు. జగన్ విజన్ కి సపోర్ట్ గా బాలయ్య చిన్నల్లుడు మాట్లాడడంతో టీడీపీ ఏమీ చెప్పలేని పరిస్థితి ఏర్పడింది అని అంటున్నారు.

అయితే శ్రీ భరత్ అన్నీ ఆలోచించే ఈ విధంగా చెప్పారు అని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీ అప్పుల్లో ఉందని అమరావతి రాజధానిగా ఎంత పెట్టుబడి పెట్టినా కష్టం అన్నట్లుగా ఆయన మాట్లాడారు. టీడీపీ వర్గాలు శ్రీ భరత్ మాటలతో ఇరకాటంలో పడుతున్నారు. 

దాంతో తాను అన్నది మీడియా వారు చూపించింది వేరు అని ఆయన వివరణ ఇచ్చినా అది కూడా సహేతుకంగా లేకపోగా విశాఖ రాజధానికే మద్దతుగా ఉండడంతో టీడీపీ ఏమీ చేయలేని పరిస్థితి ఉంది అని అంటున్నారు. ఇన్నాళ్ళు చంద్రబాబు విజనరీ అని డప్పు వాయించిన వారు జగన్ విజన్ ఇదీ అని చెప్పకనే చెప్పి ఒప్పుకుంటున్నారు అని అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?