ఊరికో మాట, పూటకో వేషం.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గురించి అర్థమయ్యేలా చెప్పడానికి సులువుగా ఉపయోగించల పదాలివి! పూటకో వేషం వేయగలరు, ఏ పార్టీతో అయినా కలవగలరు, ఎవరినైనా తిట్టగలరు, ఎవరినైనా పొడగగలరు, మరెవరికైనా పొర్దుదండాలూ పెట్టగలరు! ఇలా చంద్రబాబు నాయుడు తీరుకు ఒక నియమం అంటూ ఉండదు!
గత ఎన్నికల సమయంలో ప్రధాని మోడీని హద్దుమీరి అడ్డంగా విమర్శించిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ఆయనకు పొర్లుదండాలు పెడుతూ ఉన్నారు. తన పార్టీ మెనిఫెస్టోని తమ అధికారిక వెబ్ సైట్ నుంచి డిలీట్ చేయించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇంకో మెనిఫెస్టోతో అడ్డమైన హామీలను ఇచ్చి జనాలను నమ్మించే ప్రయత్నంలో ఉన్నారు!
చంద్రబాబు మాటలు ఎలా ఉంటాయో, ఆ తర్వాత చేతలు ఎలా ఉంటాయో ప్రజలకు అర్థం కావడానికి గత అనుభవాలు ఉండనే ఉన్నాయి! అయితే అవి సరిపోవనుకుంటే.. చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం తీరును గమనించినా చాలు! ఆయన ఊరికో మాట మాట్లాడగలరని, పూటకో వేషం వేయగలరని స్ఫష్టం అవుతుంది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప జిల్లాకు వెళ్లిన చంద్రబాబు నాయుడు అక్కడ అన్నమయ్య జిల్లా కేంద్రం విషయంలో ఉన్న వివాదం నుంచి కూడా లబ్ధి పొందే ప్రయత్నం చేశారు! మరి అదైనా సరిగా చేశారా.. అంటే, అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను ఉంచాలనేది ఒక డిమాండ్. అయితే జగన్ ప్రభుత్వం రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను చేసింది.
చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారానికి వెళ్లి.. రాజంపేటలో మాట్లాడుతూ.. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను చేస్తామంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కొంత సేపటికి రాయచోటికి ప్రచారానికి వెళ్లారాయన, అక్కడ రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగిస్తామంటూ హామీ ఇచ్చేశారు! ఇదీ చంద్రబాబు నాయుడు తీరు! రాజంపేటలోనేమో అధికారం ఇస్తే జిల్లా కేంద్రాన్ని అక్కడకు మారుస్తామంటూ, రాయచోటికి వెళ్లి రాయచోటే జిల్లా కేంద్రమంటూ మాట్లాడారు!
నలభై కిలోమీటర్ల దూరంలో ఒకే రోజులో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఇవి! ఒకదానికి మరొకటి విరుద్ధంగా ఉన్నాయి. ఆయన చంద్రబాబు నాయుడు ఆయనకు వినేవాడు లోకువ, అందుకే ఏదైనా చెబుతారు, ఎలాగైనా చెబుతారు!
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు