ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయ పార్టీలు ఒక వైపు ప్రచారం చేస్తూ, మరోవైపు ఓటర్ల ప్రలోభాలకు తెరలేపారు. పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఓటుకు భారీ రేటు పెట్టారు. తన సామాజిక వర్గానికి చెందిన ఓట్లు భారీ సంఖ్యలో ఉన్నప్పటికీ, కేవలం అభిమానంతో ఓట్లు వేస్తారని పవన్ నమ్మడం లేదు.
అంతిమంగా డబ్బుపైనే అందరికీ ప్రేమ అని ఆయన విశ్వసిస్తున్నారు. దీంతో ఓటుకు రూ.5 వేలు చొప్పున జనసేన పిఠాపురంలో పంచుతున్నట్టు స్థానికుల ద్వారా తెలిసింది. వర్మ నుంచి కూడా ఆశించిన స్థాయిలో సహకారం లభించకపోవడంతో గెలుపుపై పవన్కు భయం పట్టుకుంది. వీళ్లందరినీ నమ్ముకోవడం కంటే, డబ్బును నమ్ముకుంటే మంచిదని ఆయన మనసులో మాట.
దీంతో వైసీపీకి షాక్ ఇచ్చేలా పవన్కల్యాణ్ పెద్ద మొత్తంలో ఓటర్ల కొనుగోలుకు తెరలేపారు. మరోవైపు ఎలాగైనా పవన్ను ఓడించాలనే పట్టుదలతో ఉన్న వైసీపీ మాత్రం... ఓటర్లను ప్రలోభ పెట్టడంలో వెనుకపడినట్టు తెలిసింది. వైసీపీ తరపున పోటీ చేస్తున్న వంగా గీత ఓటుకు రూ.3 వేలు చొప్పున ఇస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు.
పవన్కల్యాణ్ భారీ మొత్తంలో ఓటుకు రేటు కట్టారనే సంగతిని వైసీపీ పెద్దల దృష్టికి స్థానిక నాయకులు తీసుకెళ్లినట్టు తెలిసింది. వైసీపీ పెద్దల నుంచి "వెయిట్" అనే సందేశం వచ్చినట్టు సమాచారం. వైసీపీ తమ కంటే రూ.2 వేలు తక్కువ పంపిణీ చేస్తుండడంతో జనసేన నేతల్లో సంతోషం కనిపిస్తోంది. అయితే ఈ సంతోషం తాత్కాలికమా? శాశ్వతమా? అని తేలేందుకు మరికొన్ని గంటలు ఎదురు చూడాల్సి వుంటుంది.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు