కలవలేదు కానీ.. ఫోన్ లో టచ్ లో ఉంది!

సాహో సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్ధాకపూర్ ను హీరోయిన్ గా సెలక్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ బ్యూటీ మాత్రం ఇంకా మూవీ సెట్స్ పైకి రాలేదు. ప్రస్తుతం 'హసీనా పార్కర్' అనే…

సాహో సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్ధాకపూర్ ను హీరోయిన్ గా సెలక్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ బ్యూటీ మాత్రం ఇంకా మూవీ సెట్స్ పైకి రాలేదు. ప్రస్తుతం 'హసీనా పార్కర్' అనే సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. ప్రభాస్ ను ఇంకా కలవలేదని అంటోంది.

“ప్రభాస్ ను ఇంకా నేను కలవలేదు. కానీ ఫోన్ లో మాత్రం మేం మాట్లాడుకున్నాం. వీలైనంత త్వరగా ప్రభాస్ ను కలవాలని ఉంది. ప్రభాస్ ఇప్పుడు ఇండియన్ స్టార్. అతడితో కలిసి సెట్స్ పైకి వెళ్లేందుకు ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను.” శ్రద్ధాకపూర్ రియాక్షన్ ఇది.

హిందీ సినిమా ప్రమోషన్ పూర్తయిన వెంటనే సాహో సెట్స్ పైకి వస్తానంటోంది శ్రద్ధాకపూర్. ఈ గ్యాప్ లో తెలుగు కూడా నేర్చుకుంటోంది. ప్రస్తుతం ఓ ట్యూటర్ ను పెట్టుకొని తెలుగు నేర్చుకుంటున్నానని వీలైనంత త్వరగా తెలుగులో మాట్లాడతానని అంటోంది.

శ్రద్ధాకపూర్ కు ఇదే మొదటి టాలీవుడ్ సినిమా. సాహో సినిమాను ఒకేసారి తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించనున్నారు. అందుకే ఈ సినిమా కోసం బాలీవుడ్ ఆర్టిస్టుల్నే ఎక్కువగా తీసుకుంటున్నారు. తమిళ, మలయాళ భాషల్లోకి మూవీని డబ్ చేస్తారు.