టచ్ చేసి చూశాడు.. రియాక్షన్ లేదు!

పుట్టినరోజు సందర్భంగా ఒకేసారి 2సినిమాలు ఎనౌన్స్ చేశాడు రవితేజ. దాదాపు ఒకే పీరియడ్ లో రెండు సినిమాల్ని సెట్స్ పైకి తీసుకొచ్చాడు. ఒకటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న రాజా ది గ్రేట్ అయితే..…

పుట్టినరోజు సందర్భంగా ఒకేసారి 2సినిమాలు ఎనౌన్స్ చేశాడు రవితేజ. దాదాపు ఒకే పీరియడ్ లో రెండు సినిమాల్ని సెట్స్ పైకి తీసుకొచ్చాడు. ఒకటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న రాజా ది గ్రేట్ అయితే.. రెండోది విక్రమ్ సిరికొండను దర్శకుడిగా పరిచయం చేస్తూ చేస్తున్న 'టచ్ చేసి చూడు'. రెండూ కమర్షియల్ ఎంటర్ టైనర్లే. రెండు సినిమాల్ని కథలు విన్న తర్వాతే ఓకే చేశాడు రవితేజ. 

కానీ 'టచ్ చేసి చూడు' మాత్రం ఈ హీరోకు చుక్కలు చూపిస్తోంది. ఈ ప్రాజెక్టును ఎందుకు టచ్ చేశానా అని ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునేలా చేస్తోంది. నిజానికి రాజా ది గ్రేట్ కంటే ముందే 'టచ్ చేసి చూడు' సినిమా కంప్లీట్ అవ్వాల్సింది. కానీ విక్రమ్ సిరికొండ వర్కింగ్ స్టయిల్ రవితేజకు నచ్చలేదు. దీంతో ఆ మధ్య కొన్నాళ్ల పాటు సినిమాను పక్కనపెట్టేశాడట రవితేజ. 

అప్పట్నుంచి ఎప్పుడు టచ్ చేసినా ఈ ప్రాజెక్టు నుంచి నెగెటివ్ రిజల్ట్ కొడుతోందట రవితేజకి. అందుకే ఇప్పుడు ఫోకస్ మొత్తం రాజా ది గ్రేట్ మూవీపై పెట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ లో ఉంది. సెప్టెంబర్ 15వరకు అది కొనసాగుతుంది. అప్పటికి 2పాటలు మినహా షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు టచ్ చేసి చూడు ప్రాజెక్టుపై ఓ నిర్ణయం తీసుకుంటాడట రవితేజ.