కాసేపు బాల‌య్య అవ‌తార‌మెత్తిన మంత్రి

కార్య‌క‌ర్త‌ల‌ను, అభిమానుల్ని అగ్ర‌హీరో, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ కొట్ట‌డం చూశాం. బాల‌య్య ప‌ర్య‌ట‌న అంటే, ఎవ‌రో ఒక‌రు దెబ్బ‌లు తినాల్సిందే. బాల‌య్య చేతిలో దెబ్బ‌లు తినడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామ‌ని ఎల్లో మీడియా…

కార్య‌క‌ర్త‌ల‌ను, అభిమానుల్ని అగ్ర‌హీరో, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ కొట్ట‌డం చూశాం. బాల‌య్య ప‌ర్య‌ట‌న అంటే, ఎవ‌రో ఒక‌రు దెబ్బ‌లు తినాల్సిందే. బాల‌య్య చేతిలో దెబ్బ‌లు తినడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామ‌ని ఎల్లో మీడియా ద్వారా సంతోషాన్ని ప్ర‌క‌టించిన అభిమానులు, టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను చూశాం. తాజాగా  రెవెన్యూశాఖ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావులో కాసేపు నంద‌మూరి బాల‌య్య ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసిన‌ట్టున్నారు.

త‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌ల‌క‌డానికి వ‌చ్చిన అభిమానిపై ఆయ‌న చేయి చేసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. స‌హ‌జంగా నెమ్మ‌ద‌స్తుడైన నాయ‌కుడిగా పేరున్న ధ‌ర్మాన‌లో కోపాన్ని చూసిన వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. జ‌గ‌న్ కొత్త కేబినెట్‌లో శ్రీ‌కాకుళం ఎమ్మెల్యే ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు చోటు ద‌క్కించుకున్నారు. కీల‌క‌మైన రెవెన్యూశాఖ‌ను ఆయ‌న‌కు కేటాయించారు.

మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్న త‌ర్వాత తొలిసారిగా ఆయ‌న శుక్ర‌వారం శ్రీ‌కాకుళం వెళ్లారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న్ను అభినందించేందుకు కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు వెల్లువెత్తారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌తో ఓ అభిమాని క‌ర‌చాల‌నం చేశారు. 

ఎంత‌సేప‌టికీ చేతిని విడిచిపెట్ట‌క‌పోవ‌డంతో ధ‌ర్మాన తీవ్ర అసౌక‌ర్యానికి గురయ్యారు. దీంతో ఒక్క‌సారిగా కోపోద్రిక్తుడైన ధ‌ర్మాన స‌ద‌రు అభిమానిపై చేయి చేసుకోవ‌డం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. బాల‌య్య‌ను మ‌న ధ‌ర్మాన గుర్తు చేశార‌ని అధికార పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది.