లడ్డూ వివాదం: సుప్రీం కోర్టు తీర్పు పై ఉత్కంఠ!

తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, చేప నూనె వంటి పదార్థాలు కలిపారన్న ఆరోపణలపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సుప్రీం కోర్టు ఇవాళ విచారించనుంది. ఈ విషయంపై బీజేపీ సీనియ‌ర్ నేత మాజీ…

తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, చేప నూనె వంటి పదార్థాలు కలిపారన్న ఆరోపణలపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సుప్రీం కోర్టు ఇవాళ విచారించనుంది. ఈ విషయంపై బీజేపీ సీనియ‌ర్ నేత మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి, టీటీడీ మాజీ చైర్మన్, రాజ్య‌స‌భ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పిటిషన్లు వేశారు.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నిరాధార ఆరోప‌ణ‌లు చేశార‌ని, జంతువుల కొవ్వు, మిగ‌తా ప‌దార్థాలు క‌లిశాయ‌ని వ్యాఖ్య‌లు చేశార‌ని పిటిష‌న్‌లో సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి పేర్కొన్నారు. కావున తిరుమ‌ల ప్ర‌సాదంపై నిజాలు నిగ్గు తేల్చాల‌ని సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి పిటిష‌న్‌లో కోర‌డం గ‌మ‌నార్హం. వైవీ సుబ్బారెడ్డి కూడా ల‌డ్డు క‌ల్తీ విష‌యంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జ‌డ్జి, నిపుణుల‌తో విచార‌ణ చేయించాల‌ని పిటిష‌న్‌లో కోరారు.

సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ పై కేసు టేకప్ చేయడం, ఇది చంద్రబాబుకు గట్టి షాక్ అనే ప్రచారం జరుగుతోంది. ఇప్ప‌టికే తిరుమ‌ల ల‌డ్డు క‌ల్తీపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ఏపీ ప్ర‌భుత్వం గుంటూరు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి నేతృత్వంలో విశాఖ రేంజి డీఐజీ గోపీనాథ్‌ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు స‌భ్యులుగా సిట్‌ను ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఇవాళ సుప్రీం కోర్టులో తిరుమల లడ్డూ వివాదంపై జరిగే విచారణకు అందరి దృష్టి నిలిచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఆరోపణలపై న్యాయస్థానం ఎటువంటి తీర్పు ఇవ్వబోతుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

16 Replies to “లడ్డూ వివాదం: సుప్రీం కోర్టు తీర్పు పై ఉత్కంఠ!”

  1. ఎలాగూ సిట్ వేశారు అది కూడ ఐజి స్థాయి అధికారితో

    కాబట్టి బహుశ సుప్రీంకోర్టుకూడ ఈ పరిస్థితినే కొనసాగనివ్వచ్చు .ఇది సిబిఐ లేకపోతే న్యాయమూర్తి విచారణ అంత లోతైనకేసుమాత్రంకాదు .

  2. ఒక నాయకుడు నీ ప్రజలు తమ అధినేత గా చేసుకున్నప్పుడు తన మీద నమ్మకం ఉండే చేసుకుంటారు… Evm manipulation చేసి కాదు

    కానీ జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పింది చేస్తారు అని సిఎం నీ చేసుకున్నారు

    మా లాంటి అభిమానుల మనవడు మనవరాలు ఆంధ్ర కి వస్తె రికార్డ్స్ గూగుల్ లో చెక్ చేసినా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ లో ఏం చేశాడో కనపడుతుంది…

    మాకు అది చాలు …. మీరు మాత్రం ద్వేషం తో కులం మతం అనీ మాట్లాడుకోండి

    గత మా 5 సంవత్సరాల పాలన లో మా పాలన గొప్పగా ఉంది అని tag చేసాను .మీది మూడు నెలల లో అట్టర్ ఫ్లాప్

    బాగా గొప్పగా పరిపాలన చేసిన వాటికి ట్యాగ్ చెయ్యండి

  3. చెంబాగాడి 100 రోజుల పాలన దరిద్రం గా వున్నదని డైవర్షన్ పాలిటిక్స్ చేసాడు. వాడితో పాటు చిడతలు వాయించిన పచ్చతమ్ముళ్ళని కూడా వెర్రి పప్పలను చేసాడు. ఇట్లుంటది మన చెంబుగాడితోని..

  4. 320 రుయాపాయలకు మన శ్రీ కోర్ట్ వారు కరెక్ట్ ఆవునెయ్య తెప్పిస్తారు ఆ రేట్ కి సామాన్యులు కూడా ఇస్తారు కోర్ట్ కొంచం పుణ్యం కట్టుకొంటే బాగుంటుంది కోర్ట్ ద్వారా విచారణ జరిగితే బాబాయ్ హత్యలాగా అక్రమాస్తుల కేసు లాగా చేస్తారు ప్రజలు మరచిపోయేవరకు స్టే లు ఇస్తూనే వుంటారు కేజ్రీవాల్ కేసులోనూ చంద్రబాబు కేసులోనూ ఏమి ఆధారాలు వున్నాయి అని బెయిల్ లేకుండా లోపలేశారు ఆ కేసు లు తేలుతూ లోనికి ఎంత కాలం పట్టిందో తెలుసు ఈ వ్యాఖ్యలు చెయ్యటానికి ఎంత సమయం తీసుకున్నారో తెలుసు

  5. అన్ని షాక్ లు సీబీన్ కేనా ? మొన్న కూడా అంతే జగన్ కాలి నడకన తిరుమలకి అని చెప్పగానే తొందర పది ” లడ్డు వివాదంలో పైచెయ్యి సాధిచిన వై చీపి” అని రాసావు .. తీరా చూస్తే వాడు నాకు కాలు నొప్పి నేను నడవను అని / డిక్లరేషన్ ఇవ్వను అని .. ఆఖరుకి మీ అందరాని వెర్రి పువ్వుల్ని చేస్తూ వాడు మాత్రం తోక ముడిచాడు . కొంచెం ఓపిక పట్టి ఆర్టికల్స్ రాయరా అయ్యా .

    1. వెళ్లకుండా అడ్డుకొని లేనిపోని ఆంక్షలు వీడిస్తే ఎలా పోతారు జగన్ ఎందుకు ఇవ్వాలి declaration

      1. enduku ivvali ante.. rule undi kabatti.. anyamatastulu nenu venkateswaraswamini nammanu ani cheppi konda paiki rammannaru… dantlo tappu emundi. Declaration iste avamanamemundi… the real problem is.. Anniya declaration iste.. Chri*stians dont agree.. So he will loose theri votes also.. Hindu votes almost already gone because of his actions for the last 5 years and this L@ddu issue.

        1. హోమ్ మినిస్టర్ అనిత గారిది ఏ క్యాస్ట్ ? ఆమె ఈ మధ్యనే తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది , ఆమె డిక్లరేషన్ ఇచ్చారా ? మీవి ఎలాంటి బ్రష్టు రాజకీయాల్లో ఇక్కడే అర్థమవుతుంది . మన గవర్నర్ నజీర్ గారు తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇచ్చారా ?

Comments are closed.