క్రేజీ కాంబినేషన్.. అంతా ఉత్తిదే

33 ఏళ్ల తర్వాత కలుస్తున్నారు.. ఇండియాలోనే బిగ్గెస్ట్ కాంబినేషన్.. క్రేజీ ప్రాజెక్టు.. 200 కోట్ల బడ్జెట్.. ఇలా రజనీకాంత్-మణిరత్నం సినిమాపై గడిచిన 2 రోజులుగా తెగ ప్రచారం జరిగింది. దళపతి తర్వాత వీళ్లిద్దరూ కలిసి…

33 ఏళ్ల తర్వాత కలుస్తున్నారు.. ఇండియాలోనే బిగ్గెస్ట్ కాంబినేషన్.. క్రేజీ ప్రాజెక్టు.. 200 కోట్ల బడ్జెట్.. ఇలా రజనీకాంత్-మణిరత్నం సినిమాపై గడిచిన 2 రోజులుగా తెగ ప్రచారం జరిగింది. దళపతి తర్వాత వీళ్లిద్దరూ కలిసి మరో పెద్ద సినిమాలో నటించబోతున్నారంటూ వార్తలొచ్చాయి.

అవన్నీ నిజం కాదని స్పష్టం చేశారు నటి, మణిరత్నం భార్య సుహాసిని. మణి-రజనీ కాంబోలో సినిమా అనేది కేవలం ప్రచారం మాత్రమేనని ఆమె కొట్టిపారేశారు. ఇద్దరి మధ్య సినిమాకు సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదని క్లారిటీ ఇచ్చాడు.

అంతేకాదు, బయట ఇంత ప్రచారం జరుగుతుందనే విషయం బహుశా రజనీకాంత్ కు తెలిసి ఉండకపోవచ్చని వ్యాఖ్యానించిన సుహాసిని.. మణిరత్నంకు మాత్రం అస్సలు తెలియదని అన్నారు.

ప్రస్తుతం మణిరత్నం, కమల్ హాసన్ హీరోగా థల్ లైఫ్ అనే సినిమా చేస్తున్నాడు. దశాబ్దాల తర్వాత వీళ్లిద్దరి కలయికలో వస్తున్న సినిమా ఇది. ఇదే కోవలో మణిరత్నం-రజనీ కాంబోలో కూడా సినిమా వస్తుందని ప్రచారం జరిగింది. అయితే అదంతా కేవలం పుకారు మాత్రమేనని సుహాసిని కొట్టిపారేశారు.

వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు రజనీకాంత్. వేట్టయన్ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసిన సూపర్ స్టార్, ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమా చేస్తున్నారు.

2 Replies to “క్రేజీ కాంబినేషన్.. అంతా ఉత్తిదే”

Comments are closed.