ఇలాగైతే ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త రాదా?

కూట‌మి ప్ర‌జాప్ర‌తినిధుల అరాచ‌కాల గురించి రోజుకో కొత్త విష‌యం వెలుగు చేస్తోంది., అయితే సీఎం చంద్రబాబు భ్ర‌మ‌లో ఉన్నారా?

కూట‌మి ప్ర‌జాప్ర‌తినిధుల అరాచ‌కాల గురించి రోజుకో కొత్త విష‌యం వెలుగు చేస్తోంది., అయితే సీఎం చంద్రబాబు భ్ర‌మ‌లో ఉన్నారా? లేక జ‌నాల్ని భ్ర‌మ‌ల్లో ఉంచాల‌ని అనుకుంటున్నారో తెలియ‌దు. వైసీపీ పాల‌నంతా విధ్వంస‌మ‌యం, తాము రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామ‌ని ఆయ‌న పదేప‌దే గొప్ప‌లు చెప్ప‌కుంటుంటారు. ఏ పాల‌కులైనా త‌మ ఏలుబ‌డిలో అరాచ‌కాలు జ‌రుగుతున్నాయ‌ని అంగీక‌రించ‌రు.

క‌నీసం అంత‌రాత్మ‌కైనా స‌మాధానం చెప్పుకోవాల్సి వుంటుంది. అప్పుడే త‌ప్పుల్ని స‌రిదిద్దుకుంటూ, ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించుకోడానికి ప్ర‌య‌త్నిస్తుండాలి. కానీ చంద్ర‌బాబు పాల‌న‌లో త‌ప్పుల్ని స‌రిదిద్దుకునే రాజ‌కీయ వాతావ‌ర‌ణం క‌నిపించ‌డం లేదు. టీడీపీ అనుకూల పత్రిక‌లే …మారింది పాల‌నే త‌ప్ప‌, అరాచ‌క విధానాలు కాద‌ని క‌థ‌నాలు రాయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇవాళ గుంటూరు జిల్లాలో ఇష్టానుసారం ఇసుక దోపిడీకి పాల్ప‌డుతున్న క‌థ‌నం.

నిన్న శ్రీ‌కాళ‌హ‌స్తి ఎమ్మెల్యే బొజ్జ‌ల సుధీర్‌రెడ్డి దాదాగిరి గురించి క‌థ‌నం. అంత‌కు ముందు, కందుకూరు ఎమ్మెల్యే రామాయ‌ప‌ట్నం పోర్టుపై బెదిరింపులు. తొమ్మిది రోజుల క్రితం సీనియ‌ర్ ఐఏఎస్ స‌తీమ‌ణులు స్టార్‌హోట‌ళ్ల‌లో ఏకంగా కార్యాల‌యాలు తీసుకుని, స‌మాంత‌ర అధికారాన్ని కొన‌సాగిస్తున్న వైనం. ఇవ‌న్నీ చూస్తే, దిగిపోయిన ప్ర‌భుత్వ పాల‌నే బెట‌ర్ అనే అభిప్రాయం క‌లిగిస్తోంది.

ఇన్నీ అరాచ‌కాలు సాగుతున్నా సీఎం చంద్ర‌బాబు చ‌ర్య‌లు తీసుకున్న దాఖ‌లాలు లేవు. కూట‌మి ప్ర‌జాప్ర‌తినిధుల అరాచ‌కాల‌పై సీఎం క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల్సి వ‌స్తే, ఏ ఒక్క‌రూ మిగ‌ల‌ర‌నే మాట వినిపిస్తోంది. మొట్ట‌మొద‌ట చంద్ర‌బాబు త‌న కుమారుడు లోకేశ్‌పై చ‌ర్య‌ల్ని మొద‌లు పెట్టి, ఆ త‌ర్వాతే త‌మ ద‌గ్గ‌రికి రావాల‌ని పేరు చెప్ప‌డానికి ఇష్ట‌ప‌డ‌ని కూట‌మి ప్ర‌జాప్ర‌తినిధులు అంటున్నారు. దీపం వుండ‌గానే ఇల్లు చ‌క్క‌దిద్దుకోవాల‌నే ఆలోచ‌న‌లో కూట‌మి ప్ర‌జాప్ర‌తినిధులున్నారు.

ఇసుక‌, గ్రావెల్‌, భూదందాల‌పై కూట‌మి ప్ర‌జాప్ర‌తినిధులు దృష్టి సారించారు. ఇత‌ర‌త్రా ఆదాయ మార్గాలేవీ లేవ‌ని అంటున్నారు. ఎన్నిక‌ల్లో కోట్లాది రూపాయిలు పెట్టుబడి పెట్టామ‌ని, ఆ సొమ్మంతా రాబ‌ట్టుకోవాలి క‌దా? అని ప్ర‌శ్నిస్తున్నారు. చంద్ర‌బాబు ఎదుటి వాళ్ల‌కు నీతులు చెబుతుంటార‌ని, ఎవ‌రికి ఎలా ఆదాయం వ‌స్తుందో త‌మ‌కు బాగా తెలుస‌ని కూట‌మి నేత‌లు ఆఫ్ ది రికార్డుగా న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

ఇలాగైతే ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త రాదా? అనే ప్ర‌శ్న‌కు… వ‌స్తుంద‌ని తెలుస‌ని, ఐదేళ్ల‌కోసారి ఏపీలో ప్ర‌భుత్వం మార‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంద‌ని, ఏం చేసినా స‌రే మార్పు త‌ప్ప‌ద‌ని అంటున్నారు. గ‌తంలో జ‌గ‌న్ మంచి చేశార‌ని, అయినా ఓడిపోలేదా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇప్పుడు తాము సూప‌ర్‌సిక్స్ ప‌థ‌కాలు, అలాగే ఇత‌ర‌త్రా చేసే ప‌రిస్థితి లేద‌ని, గ‌తంలో జ‌గ‌న్ నిబ‌ద్ధ‌త‌తో అమ‌లు చేసి ఘోరంగా ఓడిపోలేదా? అని ప్ర‌శ్నిస్తున్నారు. నిజాయితీ ఏ ద‌శ‌లోనూఏ లేద‌ని కూట‌మి నేత‌లు ముక్తాయింపు ఇస్తున్నారు.

14 Replies to “ఇలాగైతే ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త రాదా?”

  1. తెలిసే ఇంత జరుగుతుంది అంటే అన్న పరిపాలన లో ఇంకెంత ఘోరం గా ఉండి ఉంటుందో.. ఊహించుకుంటున్నారు… యాక్చి లో ఇలాంటి వి రావు ఎందుకని….ఎంత సేపు అన్న డప్పే…

  2. విభజన జరిగి పదేళ్లు అయ్యి రెండు ఎన్నికలు మాత్రమే జరిగినప్పుడు ఐదేళ్లు కి ఒకసారి మారుస్తారు అని బుర్రలో ఏకాస్తా గుజ్జు ఉన్న రాజకీయ నేత అనుకోడు…అయినా కూటమి నేతలు మాటాడక మాటాడక మీతో నే మాటాడాలి మరి ఆఫ్ the రికార్డు గా..

  3. లాస్ట్ పేరాల్లో మీరు రాసినవి అంతా సోల్లె తప్ప విషయం లేదు అని.. రాజకీయ విశ్లేషకులు abipraya పడుతున్నారు

  4. Development – 0

    Liquor – cheap

    Gov employee s – 0 trust

    Roads – 0

    భూములు – అన్నీ omfut ..ఎక్కడ చూసినా ఫోటో

    జాబ్స్ – 0

    మళ్ళీ అన్నియ అంటే….ఆలోచించుకోవటమే… డేంజర్

  5. మీ వైసీపీ అధికార ప్రతినిధి.. యాంకర్ శ్యామల పైన బెట్టింగ్ ఆప్స్ ప్రమోట్ చేసినందుకు.. సైబరాబాద్ పోలీసులు కేసులేశారు..

    ఇలాంటి వాటి వల్ల వైసీపీ లో వ్యతిరేకత ఉండదా..?

    ..

    మాట్లాడితే పచ్చ పత్రికలూ అని ఏడుస్తారు.. వాళ్ళు టీడీపీ ఎమ్మెల్యే లు చేసే అవినీతిని పేరు రాసి మరీ వార్తలు రాసేస్తున్నారు..

    మరి యాంకర్ శ్యామల పైన పెట్టిన కేసుగురించి నీ వెబ్సైటు లో గాని.. సాక్షి లో గాని వార్త రాయలేదు..

    మీరు చేసే దుర్మార్గాలను దాచేస్తే దాగిపోతుంది అనుకొంటారు.. ఎన్నికల్లో బరస్ట్ అవుతుంది..

    ..

  6. 2024- ఎలేచ్షన్స్ లో ఒక నీచుడు దరిద్రుడు ని సాగన0పడమే కూటమి లక్ష్యం… అందుకు ee 5 years ఆర్థికంగా ఇబ్బబ్దులు ఉన్న పర్లే.

    2029 – ఎలేచ్షన్స్ తర్వాత కూటమి AP ni దేశం మొత్తం mana vypu వైపు చూసేలా చేయడం పక్క..

    jai Kootami , Jai babu , Jai Pawan Jai JSP

  7. పచ్చ పత్రికలు అంటావ్.. ఆ పత్రికల్లోనే ప్రభుత్వనికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారు అంటావ్.. నీకంటూ ఒక క్లారిటీ ఏడిస్తే బెటర్ అనుకుంటా గ్యాసు ఆంధ్రా

  8. గెలిపించిన నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ కి పోకుండా, తాడేపల్లి ప్యాలెస్ లో తేరగా పండి pubg ఆడుకుంటున్న… లంగా గాణ్ణి చూత్తే ప్రజావ్యతిరేకత రాదా అధ్యక్షా??

  9. మరి అన్నీయని అసెంబ్లీ కొచ్చి నిలదీయమను రా బే..వకూఫ్….వావ్..నిన్ననే పావలా శ్యామల బెట్టింగ్ ఆప్ Ad చూసా..T షర్ట్ మీద బూబ్స్ చూపిస్తుంది గా ఆప్ పేరు ని గుర్తు పెట్టుకోమని.హహ..ఎంత పద్ధతి ..ఎంత పద్ధతి…:)

Comments are closed.