మిక్స్ డ్ టాక్ వచ్చినా అవకాశాలు ఆగలేదు

వెంకీ అట్లూరి డైరక్ట్ చేసిన మిస్టర్ మజ్ను సినిమా యావరేజ్ టాక్ మాత్రమే సంపాదించుకుంది. కానీ పరిశ్రమ మాత్రం ఈ దర్శకుడిపై నమ్మకం పెట్టుకుంది. ఇందులో భాగంగా ఇద్దరు హీరోలు వెంకీ అట్లూరికి అవకాశం…

వెంకీ అట్లూరి డైరక్ట్ చేసిన మిస్టర్ మజ్ను సినిమా యావరేజ్ టాక్ మాత్రమే సంపాదించుకుంది. కానీ పరిశ్రమ మాత్రం ఈ దర్శకుడిపై నమ్మకం పెట్టుకుంది. ఇందులో భాగంగా ఇద్దరు హీరోలు వెంకీ అట్లూరికి అవకాశం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. వాళ్లలో ఒకడు విజయ్ దేవరకొండ.

మైత్రీ మూవీమేకర్స్ బ్యానర్ పై ఓ సినిమాకు కమిట్ అయ్యాడు వెంకీ అట్లూరి. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ బ్యానర్ పై విజయ్ దేవరకొండను డైరక్ట్ చేయబోతున్నాడు ఈ దర్శకుడు. వీళ్లిద్దరి మధ్య స్టోరీ డిస్కషన్స్ కూడా జరిగాయి. ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ నిర్థారించాడు కూడా.

మరోవైపు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు నాగచైతన్య కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. మంచి స్టోరీ సెట్ అయితే సినిమా చేద్దామని వెంకీ అట్లూరికి ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు చైతూ. విజయ్ దేవరకొండ, నాగచైతన్యతో పాటు నాగశౌర్య, నితిన్ కూడా వెంకీ అట్లూరి డైరక్షన్ లో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట.

ఓవరాల్ గా చూసుకుంటే మిస్టర్ మజ్ను ఎఫెక్ట్ ఈ దర్శకుడిపై పడలేదని విషయం కనిపిస్తూనే ఉంది. కాస్త గ్యాప్ తీసుకొని తన నెక్ట్స్ సినిమా వివరాలు ప్రకటిస్తానంటున్నాడు ఈ డైరక్టర్.

బాలయ్యకు మత్తు దిగిందా!

బ్యాంకులో వేస్తే 20 లక్షలు.. సినిమా ఆడిస్తే 10 లక్షలే