సంపత్ నంది..సాయిధరమ్

సీటీమార్ సినిమాతో తన మాస్ మార్క్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చారు దర్శకుడు సంపత్ నంది. తరువాత ప్రాజెక్ట్ ను మెగా హీరో సాయిధరమ్ తేజ్ తో చేయబోతున్నారని తెలుస్తోంది.  Advertisement వాస్తవానికి…

సీటీమార్ సినిమాతో తన మాస్ మార్క్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చారు దర్శకుడు సంపత్ నంది. తరువాత ప్రాజెక్ట్ ను మెగా హీరో సాయిధరమ్ తేజ్ తో చేయబోతున్నారని తెలుస్తోంది. 

వాస్తవానికి నందమూరి బాలకృష్ణకు కథ చెప్పి వెయిటింగ్ లో వున్నారు. ఈ లోగా మరో కథను సాయి ధరమ్ కు చెప్పి ఓకె చేయించకున్నట్లు తెలుస్తోంది. 

బాలయ్య నుంచి కనుక గ్రీన్ సిగ్నల్ వస్తే సంపత్ నంది చేతిలో రెండు లడ్డూలు పడినట్లే. ఈ రెండూ కాకుండా మరో పెద్ద ప్రాజెక్టు మీద కూడా సంపత్ నంది వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఏ సినిమా ఏ సంస్థకు అన్నది ఇంకా ఫిక్స్ కాలేదు కానీ ప్రస్తుతానికి అయితే సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఓ సినిమాను నిర్మించడం పక్కా అని తెలుస్తోంది. 

ప్రస్తుతం సాయి ధరమ్ ఓ సినిమాను భోగవిల్లి ప్రసాద్ నిర్మాణంలో చేస్తున్నారు. దాని తరువాత పీపుల్స్ మీడియా సినిమా చేయాల్సి వుంది. ఆ తరువాత సంపత్ నంది సినిమా మీదకు వచ్చే అవకాశం వుంది.