Advertisement

Advertisement


Home > Movies - Movie News

చిన్న గ్యాప్ ఇచ్చారు.. మళ్లీ వస్తున్నారు

చిన్న గ్యాప్ ఇచ్చారు.. మళ్లీ వస్తున్నారు

భగవంత్ కేసరి తర్వాత అనీల్ రావిపూడి చిన్న గ్యాప్ ఇచ్చాడు. అటు సైంధవ్ తర్వాత వెంకీ కూడా గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడీ ఇద్దరూ కలిసి త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్నారు.

వెంకీ-రావిపూడి కాంబోలో మూవీ లాక్ అయిన సంగతి తెలిసిందే. 'సంక్రాంతికి వస్తున్నాం' అనేది ఈ సినిమాకు ప్రాధమికంగా నిర్ణయించిన టైటిల్. జులై నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూట్ మొదలుకాబోతోంది.

టైటిల్ కు తగ్గట్టే సంక్రాంతికి విడుదల చేయాలనే టార్గెట్ తో యూనిట్ పని చేయబోతోంది. దీనికోసం అనీల్ రావిపూడి పక్కా షెడ్యూల్స్ వేసుకున్నాడు. జులై నుంచి స్టార్ట్ చేసి డిసెంబర్ నాటికి సినిమా ఫస్ట్ కాపీ రెడీ చేయాలనేది అతడి టార్గెట్.

ఈ సినిమాలో వెంకీ సరసన గుంటూరుకారం ఫేమ్ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించనుంది. భీమ్స్ సంగీతం అందించబోతున్నాడు. దిల్ రాజు బ్యానర్ పై వస్తోంది ఈ కాన్సెప్ట్ మూవీ.

వీళ్లిద్దరి కాంబినేషన్ అనగానే ఎఫ్2, ఎఫ్3 సినిమాలు గుర్తొస్తాయి. అయితే ఈసారి వాటికి భిన్నమైన కథతో సినిమా చేయబోతున్నారు. అయితే అనీల్ రావిపూడి మార్క్, వెంకీ మార్క్ వినోదం మాత్రం మిస్సవ్వదంట.

ఈసారి వెంకీతో కలిసి ఓ క్రైమ్ సబ్జెక్ట్ చేయబోతున్నాడు అనీల్ రావిపూడి. కానీ ఇది సీరియస్ కథ మాత్రం కాదు. ట్రయాంగులర్ క్రైమ్ ఎంటర్ టైనర్ గా చెబుతున్నాడు. ఒక ఎక్స్-కాప్, ఒక ఎక్స్-గర్ల్ ఫ్రెండ్, ఒక ఎక్సలెంట్ భార్య మధ్య జరిగే కథతో ఈ సినిమా రాబోతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?