మోడీతో భేటీలో జగన్ చిత్తశుద్ధి ఇళ్లపైనే!

బుధవారం నాడు ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయిన సీఎం జగన్మోహన రెడ్డి.. చాలా అంశాలపై మంతనాలు సాగించారు. సుమారు గంటన్నరకు పైగా ప్రధానితో గడిపారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలను నివేదించారు. వీటిలో…

బుధవారం నాడు ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయిన సీఎం జగన్మోహన రెడ్డి.. చాలా అంశాలపై మంతనాలు సాగించారు. సుమారు గంటన్నరకు పైగా ప్రధానితో గడిపారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలను నివేదించారు. వీటిలో చాలా డిమాండ్లు ఉన్నాయి. అయితే.. విశ్లేషకులు ఈ వార్తలను గమనిస్తున్న దాన్ని బట్టి.. ప్రధానితో జగన్ చేసిన ప్రధాన డిమాండ్ పేదల ఇళ్లకు సంబంధించినదే.

ఉగాది నాడు రాష్ట్రంలో పాతిక లక్షల మంది పేదలకు ఇంటి స్థలాల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. చారిత్రాత్మకమైన ఆ కార్యక్రమానికి ప్రధాని మోడీని జగన్ ఆహ్వానించడం ఈ భేటీలో హైలైట్. పేదలకు ఇంటి స్థలాలు  ఇచ్చే కార్యక్రమాన్ని జగన్ ఎంత సీరియస్‌గా తీసుకుంటున్నారో… అదే సమయంలో ఆ కార్యక్రమానికి మరింత వన్నె తెచ్చేందుకు ప్రధానిని ఆహ్వానిస్తున్నారో అర్థమవుతోంది. ఇదే ఇంటిస్థలాలకు సంబంధించి జగన్ తన చిత్తశుద్ధిని మరో రీతిగా కూడా నిరూపించుకున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో ఉప్పుభూములు అంటూ సుమారు 800 ఎకరాల స్థలం ఉంది. కేంద్ర ప్రభుత్వఆధీనంలో ఉండే ఆ స్థలాలు ప్రస్తుతం నిరుపయోగంగానే ఉన్నాయి. ఆ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాల్సిందిగా జ గన్ ప్రధానిని కోరారు. పేదలకు ఇంటిస్థలాలు ఇచ్చేందుకు ఆ స్థలాన్ని వినియోగిస్తామని అన్నారు. ఈ విషయంలో జగన్ ఎంత కమిట్మెంట్ తో ఉన్నారో అర్థమవుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రత్యేకహోదా దగ్గరినుంచి, విభజనానంతర పెండింగ్ సమస్యలు, రెవెన్యూలోటు ను భర్తీ చేయడం తదితర అనేక అంశాలను కూడా జ గన్ ప్రధాని వద్ద ప్రస్తావించినట్లుగా, విన్నవించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే అవేవీ కూడా ఒక పట్టాన కొలిక్కి వచ్చే వ్యవహారాలు కాదు. హోదాకు సంబంధించినంత వరకు జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ.. అడుగుతూ ఉండాల్సిందే తప్ప..  వచ్చేది కాదు. కానీ.. ఈ భేటీ పర్యవసానంగా ఉప్పుభూములను రాష్ట్రానికి సాధించినా, ఆమేరకు పేదలకు ఇంటిపట్టాలిచ్చే కార్యక్రమానికి ప్రధాని వచ్చినా.. అది జగన్ ఘనవిజయంకిందనే చెప్పుకోవాలి.

ఫ్యాన్స్ తో రచ్చ చేసిన విజయ్ దేవరకొండ