గంటాకు కాపు సెగ… మాటల మంట

విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మీద సొంత సామాజిక వర్గం నేత గట్టిగానే మాటలు పేర్చి మంటలు పెట్టాలు. ఆయన వల్ల ఎవరికీ ఏమీ లాభం…

విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మీద సొంత సామాజిక వర్గం నేత గట్టిగానే మాటలు పేర్చి మంటలు పెట్టాలు. ఆయన వల్ల ఎవరికీ ఏమీ లాభం లేదు, ప్రత్యేకించి కాపులకు చేసింది ఏమీ లేదు అంటూ విశాఖ కాపు ఐక్య వేదిక నాయకుడు తోట రాజీవ్ ఒక్క లెక్కన ఫైర్ అయ్యారు.

గంటా ఎంతసేపూ తన సొంత ప్రయోజనాల కోసమే కాపులను దువ్వుతూ ఉంటారని, కాపులను మాయ చేసి మోసం చేసి ఎదగడమే గంటాకు తెలుసు అంటూ గట్టిగానే మాట్లాడారు. ఇంతకీ మ్యాటర్ ఏంటి అంటే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గంటా కాపు సంక్షేమ భవనం తానే మంజూరు చేయించాను అని ఏకంగా శంకుస్థాపన చేశారట.

తీరా చూస్తే ఆ తరువాత ఆయన మాజీ అయ్యారు. కానీ ఏ భవనమూ లేదని తోట రాజీవ్ ఆరోపిస్తున్నారు. ఇదంతా కాపుల మద్దతు కోసం నాడు గంటా చేసినదే అని మండిపడ్డారు. గంటా ఇలా తన రాజకీయ జీవితం కోసం కాపులను ఉపయోగించుకోవడం వల్లనే ప్రస్తుతం ఆయన పొలిటికల్ కెరీర్ కూడా ఇబ్బందులో పడిదని రాజీవ్ అంటున్నారు.

ఆయన ఉన్న పార్టీ టీడీపీలో పట్టించుకోవడంలేదని, ఇతర పార్టీలు ఎవరూ దగ్గరకు రానీయడం లేదని ఇదీ గంటా మాస్టార్ తాజా పాలిటిక్స్ అని ఎద్దేవా చేశారు. ఇక వైసీపీ ప్రభుత్వం కాపుల సంక్షేమం కోసం భవనం నిర్మాణానికి ఉచితంగా స్థలం కేటాయించినందుకు రాజీవ్ సీఎం జగన్ కి ధన్యవాదాలు తెలిపారు. తొందరలో తాము భవన నిర్మాణం చేస్తామని పేర్కొన్నారు.

తాము ఇలా కాపుల సంక్షేమం కోసం పాటు పడుతూంటే గంటా మాత్రం వారిని ఉపయోగించుకుంటున్నారు అని ఆయన అంటున్నారు. మొత్తానికి కాపులకు భవనం అన్నది ఒక కల అయితే దాన్ని వైసీపీ నెరవేరుస్తోంది. మరి గంటా కానీ టీడీపీ కానీ ఈ విషయంలో ఏమీ చేయలేదని కాపు నేతలే అంటున్నారు. మొత్తానికి గంటాకు సాటి కాపు నేత ఈ రేంజిలో విమర్శలు చేయడం చర్చనీయాంశం గానే ఉంది మరి.