చౌదరి ప్లాన్ సూపరెహె..

'రేయ్' సినిమా విడుదల కోసం పడరాని పాట్లు పడ్డాడు వైవిఎస్ చౌదరి. ఇప్పుడు ఆ సినిమాను ఎలా హిట్ చేయాలా అని కిందా మీదా అవుతున్నాడు. పవన్ కళ్యాణ్ కు వున్న ఫ్యాన్ బేస్…

'రేయ్' సినిమా విడుదల కోసం పడరాని పాట్లు పడ్డాడు వైవిఎస్ చౌదరి. ఇప్పుడు ఆ సినిమాను ఎలా హిట్ చేయాలా అని కిందా మీదా అవుతున్నాడు. పవన్ కళ్యాణ్ కు వున్న ఫ్యాన్ బేస్ ను వాడుకోవాలని డిసైడ్ అయ్యాడు. అందుకోసమే పవనిజంపై అర్జెంట్ గా చంద్రబోస్ చేత రాయించి, ఆ ఒక్క పాట కోసం అట్టహాసంగా ఫంక్షన్ చేసి మరీ విడుదల చేసాడు. 

అయితే ఇక్కడో గమ్మత్తు వుంది. ఈ సినిమా విడుదల 27న. అంటే ఇంకో పది రోజులు వుంది. కానీ ఇప్పటికి ఇంకా ఈ పవనిజం పాట మాత్రం విజువలైజ్ కాలేదు. అంటే దీన్ని ఇంకా షూట్ చేయాల్సి వుంది. ఇప్పటికిప్పుడు మొదలెట్టి పూర్తి చేసినా ఆరేడు రోజులు పడుతుంది. ఆ తరువాత మళ్లీ సెన్సారుకు ఇవ్వాలి. అంటే 27కు రెడీ అవుతుందని గ్యారంటీ లేదు.

సాయి ధరమ్ తేజ వున్నాడు కాబట్టి మెగాభిమానులు ఎలాగూ ఓ సారి చూసేస్తారు. ఇంతలో పవనిజం పాట కలుపుతారు. అంటే మళ్లీ మరోస్సారి..అంటారని చౌదరి ప్లాన్,. భలేగా వుంది కదా?