హాస్పిటల్ లో చేరిన దేవర హీరోయిన్

ఊహించని విధంగా హీరోయిన్ జాన్వి కపూర్ అస్వస్థతకు గురైంది. వెంటనే ఆమెను ముంబయిలోని ఓ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. Advertisement జాన్వి కపూర్ తీవ్ర…

ఊహించని విధంగా హీరోయిన్ జాన్వి కపూర్ అస్వస్థతకు గురైంది. వెంటనే ఆమెను ముంబయిలోని ఓ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

జాన్వి కపూర్ తీవ్ర స్థాయిలో ఫుడ్ పాయిజన్ కు గురైనట్టు వైద్యులు ప్రకటించారు. ఆమె కనీసం మరో 2 రోజులు హాస్పిటల్ లోనే ఉండాలని సూచించారు. ఇదే విషయాన్ని జాన్వి తండ్రి బోనీ కపూర్ కూడా నిర్థారించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోందని తెలిపారు.

ఆహారం విషయంలో హీరోయిన్లు చాలా జాగ్రత్తగా ఉంటారు. చాలామంది ప్రత్యేకంగా డైటీషియన్లకు నియమించుకుంటారు. జాన్వి కపూర్ కు కూడా ఓ డైటీషియన్ ఉంది. ప్రతిరోజూ ఆమె ఏం తినాలి, ఎంత మోతాదులో తినాలనే అంశాల్ని ఆ డైటీషియన్ నిర్ణయిస్తుంది. అంతేకాదు, ఆమెకు వండిపెట్టడానికి ప్రత్యేకంగా చెఫ్ లు కూడా ఉన్నారు.

ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ జాన్వి కపూర్ ఫుడ్ పాయిజన్ బారినపడడం ఆశ్చర్యం. రీసెంట్ గా ఆమె దేవర సినిమాకు సంబంధించి ఓ సాంగ్ షూట్ పూర్తి చేసింది. ఆ తర్వాత అంబానీ ఇంట జరిగిన వివాహ వేడుకకు హాజరైంది.