ప్రేమ జంట ఆత్మ‌హ‌త్య‌!

గుంటూరు జిల్లా పెద‌కాకాని వ‌ద్ద రైతు కింద ప‌డి ప్రేమ జంట ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఈ ఘ‌ట‌న బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రేమ జంట ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం శుక్ర‌వారం వెలుగు చూసింది.…

గుంటూరు జిల్లా పెద‌కాకాని వ‌ద్ద రైతు కింద ప‌డి ప్రేమ జంట ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఈ ఘ‌ట‌న బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రేమ జంట ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం శుక్ర‌వారం వెలుగు చూసింది. మృతులు దానబోయిన మ‌హేశ్ (22), నండ్రు శైల‌జ (21)గా రైల్వే పోలీసులు గుర్తించారు.

పెద‌కాకాని గ్రామానికి చెందిన మ‌హేశ్ డిప్లొమా చ‌దివాడు. ఉపాధి నిమిత్తం రెండేళ్ల క్రితం హైద‌రాబాద్ వెళ్లాడు. హైద‌రాబాద్‌లో ఓ మొబైల్ స్టోర్‌లో ఉద్యోగంలో చేరాడు. అక్క‌డే నందిగామ మండ‌లం రుద్ర‌వ‌రం యువ‌తి శైల‌జతో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఇద్ద‌రి మ‌ధ్య స్నేహం ప్రేమ‌గా మారింది.

వీళ్లిద్ద‌రి ప్రేమ సంగ‌తి ఇరు కుటుంబాల్లో తెలిసింది. శైల‌జ‌తో పెళ్లికి యువ‌కుడి త‌ల్లిదండ్రులు ఇటీవ‌ల ఒప్పుకున్నారు. అయితే యువ‌తి త‌ల్లిదండ్రులు మాత్రం ఒప్పుకోలేదు. దీంతో త‌మ‌కు పెద్ద‌లు పెళ్లి చేయ‌ర‌ని భ‌య‌ప‌డ్డారు. ఇళ్ల నుంచి ఇద్ద‌రూ పారిపోయారు. శైల‌జ కోసం కుటుంబ స‌భ్యులు వెత‌క‌డం మొద‌లు పెట్టారు. ఈ నేప‌థ్యంలో పెద‌కాకాని వ‌ద్ద రైలు ప‌ట్టాల‌పై ప్రేమ జంట విగ‌త‌జీవులుగా క‌నిపించారు. ఇరు కుటుంబాల స‌భ్యులు క‌న్నీరుమున్నీర‌య్యారు. బాధితుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

2 Replies to “ప్రేమ జంట ఆత్మ‌హ‌త్య‌!”

Comments are closed.