క‌రోనా కేసు, న‌టి అపార్ట్ మెంట్ సీల్డ్

ముంబైలో క‌రోనా క‌ల్లోలం సినీ తార‌ల‌ను కూడా తాకుతూ ఉంది. ఇప్ప‌టికే ప‌లువురు సినీ తార‌ల సిబ్బందికి క‌రోనా వైర‌స్ సోకిన‌ట్టుగా నిర్ధార‌ణ అయిన వార్త‌లు వ‌చ్చాయి. జాన్వీ క‌పూర్, క‌ర‌ణ్ జొహార్ ల…

ముంబైలో క‌రోనా క‌ల్లోలం సినీ తార‌ల‌ను కూడా తాకుతూ ఉంది. ఇప్ప‌టికే ప‌లువురు సినీ తార‌ల సిబ్బందికి క‌రోనా వైర‌స్ సోకిన‌ట్టుగా నిర్ధార‌ణ అయిన వార్త‌లు వ‌చ్చాయి. జాన్వీ క‌పూర్, క‌ర‌ణ్ జొహార్ ల వ్య‌క్తిగ‌త సిబ్బంది క‌రోనా వైర‌స్ బారిన ప‌డిన  వార్త‌లు వ‌చ్చాయి. దీంతో స‌ద‌రు తార‌లు కూడా క్వారెంటైన్లో ఉండాల్సి వ‌చ్చింది. వారి సిబ్బందిలో క‌రోనా జాడ క‌నిపించినా, వారికి ఆ వైర‌స్ సోక‌క‌పోవడంతో ఊర‌ట ల‌భించింది.

ఇప్ప‌టికే క‌రోనా కేసుల సంఖ్య‌ విష‌యంలో ముంబై న‌గ‌రం క‌రోనా పుట్టిళ్లు వుహాన్ ను దాటి పోయింది. ఇంకా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ముంబైలోనే స్టే చేసే మ‌రింత మంది సెల‌బ్రిటీల‌కు క‌రోనా వైర‌స్ తో ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. ఈ క్ర‌మంలో మ‌లైకా ఆరోరా నివ‌సిస్తున్న అపార్ట్ మెంట్ ను సీజ్ చేశార‌ట మున్సిపాలిటీ అధికారులు.

ఆ అపార్ట్ మెంట్ లో క‌రోనా వైర‌స్ సోకిన వ్య‌క్తుల‌ను గుర్తించ‌డంతో.. ముందు జాగ్ర‌త్త‌ల్లో భాగంగా ఆ అపార్ట్ మెంట్ లోకి బ‌య‌టి వాళ్ల‌ను వెళ్ల‌నీయ‌కుండా, ఆ అపార్ట్ మెంట్ వాళ్లు బ‌య‌ట‌కు రాకుండా అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇప్ప‌టికే త‌న ఫ్లాట్ లో లాక్ డౌన్ లో ఉంటోంది మ‌లైకా. అక్క‌డ నుంచినే ఆమె సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల పోస్టులు పెడుతూ ఉంది. త‌న బాలీవుడ్ స‌న్నిహితుల‌తో వీడియో చాట్ ల‌ను కూడా సోష‌ల్ మీడియా లో పోస్టు చేస్తూ ఉంది.

నిమ్మగడ్డ వ్యవహారంలో ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం