హైదరాబాద్ కు మకాం మార్చిన శృతి

కరోనా టైమ్ లో ఎక్కడ సేఫ్ అన్నది ఎవరికీ తెలియడం లేదు. అయితే కంపారిటవ్ గా ముంబాయి, చెన్నయ్ కన్నా హైదరాబాద్ నే సేఫ్ అనుకుంటున్నారు. అందుకే హీరోయిన్ శృతి హాసన్ హైదరాబాద్ కు…

కరోనా టైమ్ లో ఎక్కడ సేఫ్ అన్నది ఎవరికీ తెలియడం లేదు. అయితే కంపారిటవ్ గా ముంబాయి, చెన్నయ్ కన్నా హైదరాబాద్ నే సేఫ్ అనుకుంటున్నారు. అందుకే హీరోయిన్ శృతి హాసన్ హైదరాబాద్ కు అర్జెంట్ గా మకాం మార్చేసింది. తన తెలుగు సినిమా వ్యవహారాలు చూసే క్వాన్ టీమ్ సహాయంతో బంజారాహిల్స్ ప్రాంతంలో మాంచి ఇండిపెండెంట్ ఇల్లు అద్దెకు తీసుకుంది శృతి. ముంబాయి నుంచి నేరుగా కారులో బై రోడ్ వచ్చేసింది.

ఇక్కడ వుంటే అటు ముంబాయి, ఇటు చెన్నయ్ ఆపరేట్ చేసుకోవచ్చు అన్నది ప్లాన్ అంట. పైగా ప్రస్తుతం రవితేజ తో క్రాక్, పవన్ తో వకీల్ సాబ్ సినిమాలు వున్నాయి. వీటి ఫినిషింగ్ పనులు ఇక్కడే వుంటాయి. అందువల్ల కరోనా వ్యవహారం పూర్తిగా సెటిల్ అయ్యే వరకు శృతి ఇక ఇక్కడే వుంటుందట. ఈ సంగతి గమనిస్తే  తెలుగులో బిజీగా వున్న నార్త్ హీరోయిన్లు కూడా ఇదే పని చేస్తారేమో?

‘జగనన్న చేదోడు’ ప్రారంభం

జగన్ గారికి చాలా థాంక్స్