నాటా మహాసభలలొ అలరించనున్న మహిళల కార్యక్రమాలు

డాలస్ లో జులై 1, 2 తేదీల్లో జరగనున్న ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) 2023 మహాసభల్లో నిర్వహించబోయే విమెన్స్ ఫోరం కార్యక్రమాలు విమెన్ ఎంపవర్మెంట్ ముఖ్యోద్దేశంగా ఉండేలా విభిన్నం గా ఏర్పాట్లు…

డాలస్ లో జులై 1, 2 తేదీల్లో జరగనున్న ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) 2023 మహాసభల్లో నిర్వహించబోయే విమెన్స్ ఫోరం కార్యక్రమాలు విమెన్ ఎంపవర్మెంట్ ముఖ్యోద్దేశంగా ఉండేలా విభిన్నం గా ఏర్పాట్లు చేస్తున్నామని నాటా కన్వెన్షన్ 2023 విమెన్స్ ఫోరం ఛైర్‌పర్సన్ స్వాతీ సానపురెడ్డి తెలిపారు. విమెన్స్ ఫోరం అంటే కుట్లు అల్లికలు సరదా ముచ్చట్లు కాదు, మహిళా సాధికారత అని చాటి చెప్పేలా తమ కార్యక్రమాలు విభిన్నంగా, వినూత్నంగా రూపుదిద్దుకుంటున్నాయి అని తెలిపారు.

శనివారం కార్యక్రమాల్లో “మహిళా పరివర్తన” శతాబ్దాలుగా మహిల ఎదుగుదలను “అతివతత్వం పరిపూర్ణత్వం” అనే సంగీత నృత్య దృశ్య రూపకంగా ప్రదర్శిస్తామని, హాస్య వినోదం, మహిళా ప్రతిభ- వివిధ రంగాలలో ప్రముఖుల ఉపన్యాసలు,  చర్చలు, 1930 నుంది 1980 వరకు ఎంతో శ్రమపడి శ్రద్దతో సేకరించిన పురాతన చీరల ప్రదర్శన ఏర్పాటు చేసామన్నారు.

ఆదివారం టాక్ ఆఫ్ ద టౌన్ తో మొదలై, సంగీత సాహిత్య సమ్మోహనం లో మాన్యుల మన్ననతో సాగి, మహిళా ప్రతిభ- వివిధ రంగాలలో ప్రముఖుల తో చర్చలుగావించి, మహిళా తెలుసుకో సెగ్మెంట్ లో అలంకరణ పరంగా దైనందిన జీవన విధానంలో అలవర్చుకోవల్సిన సూచనలు, సొగసు చూడతరమా లో కనువిందైన వస్త్రధారణ ఉంటాయని తెలిపారు.

నాటా సభల్లో నిర్వహించే మహిళా ఫోరంకు హాజరయ్యే అతిథుల జాబితాలో వివిధ రంగాలలో సిద్దహస్థులైనటువంటి వాసిరెడ్డి  పద్మ, ఊమా భారతి కోసూరి, అమల దుగ్గిరాల, మణి శాస్త్రి, పద్మ సొంటి, ఉమా దేవిరెడ్డి, వసంత లక్ష్మి అయ్యగారి, వైష్ణవి రంగరాజన్, ప్రేమ రొడ్డం, కీర్తన శాస్త్రి, పల్లవి శాస్త్రి, అపూర్వ చరణ్ మరియు వివేక్ తేజ చేరుపల్లి తదితరులు పాల్గొంటారని, వీరుకాక తెలుగు సినీ తారలెవరు తళుక్కుమంటారో వచ్చి చూడాల్సిందే అన్నారు.

క్రిష్ణవేణి శీలం, లక్ష్మీ అన్నపూర్ణ పాలేటి, ప్రశాంతి చింతారెడ్డి, లక్ష్మీ కొమ్మూరి, గాయత్రి గౌని, అను బెనకట్టి, కవిత రాణి కోటి, , లక్ష్మి సజిత అళహరి,సంధ్య క్రాలేటి, స్వర్ణ అట్లూరి జట్టుగా అందరిదీ 'ఒకే మాట ఒకే బాట ' అంటూ గత ఆరు నెలలుగా ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమాలను రూపొందించినట్లు తెలిపారు. 

రెండు రోజులూ కూడా రూం నెం.164 లో ఈ ఫోరం కార్యక్రమాలు ఉంటాయని,  అందరికీ నచ్చేలా ఏర్పాటు చేసిన తమ కార్యక్రమాలలో పాల్గొని జయప్రదం చేయాలని అందరికి ఇదే మా ఆహ్వానం అని తెలిపారు.అధ్యక్షుడు శ్రీధర్ కొర్సపాటి మరియు కన్వీనర్ ఎన్నెమ్మెస్ రెడ్డి తమను ఎంతగానో ప్రోత్సహించి అన్నివిధాల సహకరించారని, వారి ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలిపారు.