చైతూ మూడో హీరోయిన్ ఎవరు?

ప్రేమమ్ రీమేక్.. మజ్ఞు షూటింగ్ విశాఖలో ప్రారంభమై చకచకా జరిగిపోతోంది. అయితే ఇప్పటికీ ఇంకా మూడో హీరోయిన్ ఫిక్స్ కాలేదు. నాగచైతన్య సరసన శృతి హాసన్..అనుపమ పరమేశ్వరన్ ఫిక్సయిపోయారు. మూడో హీరోయిన్ గా లోఫర్…

ప్రేమమ్ రీమేక్.. మజ్ఞు షూటింగ్ విశాఖలో ప్రారంభమై చకచకా జరిగిపోతోంది. అయితే ఇప్పటికీ ఇంకా మూడో హీరోయిన్ ఫిక్స్ కాలేదు. నాగచైతన్య సరసన శృతి హాసన్..అనుపమ పరమేశ్వరన్ ఫిక్సయిపోయారు. మూడో హీరోయిన్ గా లోఫర్ లో నటిస్తున్నదిశా పటానీ ని అనుకున్నారు కానీ, తరువాత మళ్లీ కాదనుకున్నారు. 

అప్పటి నుంచి ఎవరు..ఆ మూడో హీరోయిన్ అన్నది తేలలేదు. ఇండస్ట్రీలో ఇప్పుడు వున్నవాళ్లని, ముంబాయి ఆల్బమ్ లు అన్నీ చెక్ చేసేసారు కానీ ఇంకా ఫిక్స్ కాలేదు. ఇప్పుడు షూటింగ్ కూడా ప్రారంభమై పోయింది. తాజాగా రెజీనా ను కన్సిడర్ చేస్తారా అన్న టాక్ వినిపిస్తోంది. కానీ కాదు, అని కొత్త అమ్మాయి కోసం చూస్తున్నారనీ ఇంకో టాక్. 

అయితే ఇప్పటికే అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ కు కొత్త ఫేస్..కదా, ఇద్దరు కొత్త ఫేస్ లు అయితే బాగుంటుందా అన్నది మరో డిస్కషన్ పాయింట్. మరి ఏం చేస్తారో? ఎవర్ని ఫిక్స్ చేస్తారో?