చక్రి మరణంపై అనుమానాలు.?

సినీ సంగీత దర్శకుడు చక్రి ఇటీవలే గుండెపోటుతో మరణించిన విషయం విదితమే. ఆయన మరణంపై అనుమానాలున్నాయంటూ స్వయంగా చక్రి భార్య శ్రావణి ఆరోపిస్తున్నారు. చక్రి మరణించాక ఆయన కుటుంబ సభ్యుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయంటూ…

సినీ సంగీత దర్శకుడు చక్రి ఇటీవలే గుండెపోటుతో మరణించిన విషయం విదితమే. ఆయన మరణంపై అనుమానాలున్నాయంటూ స్వయంగా చక్రి భార్య శ్రావణి ఆరోపిస్తున్నారు. చక్రి మరణించాక ఆయన కుటుంబ సభ్యుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయంటూ పోలీసులను ఆశ్రయించిన శ్రావణి, చక్రి మరణంపై అనుమానాలు వ్యక్తం చేయడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

తెలుగు సినీ పరిశ్రమలో సంగీత దర్శకుడిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న చక్రి, పలు సేవా కార్యక్రమాలతోనూ అందరి మన్ననలూ అందుకున్నాడు. దురదృష్టవశాత్తూ అతని భారీ శరీరంమే ఆయన్ను మరణశయ్యపైకి నెట్టేసింది. ఇక, శ్రావణిని ప్రేమించి పెళ్ళాడాడు చక్రి.

ఓ సినిమాకి సంబంధించి మ్యూజిక్‌ సిట్టింగ్స్‌లో పాల్గొని, అనంతరం ఇంటికి వచ్చి అర్థరాత్రి సమయంలో నిద్రపోయిన చక్రి, అలానే శాశ్వతనిద్రలోకి వెళ్ళిపోయాడు. చక్రి మరణంతో సినీ పరిశ్రమ షాక్‌కి గురయ్యింది. చక్రి కుటుంబ సభ్యులూ కన్నీరుమున్నీరయ్యారు. అయితే మూడో రోజుకే చక్రి కుటుంబంలో విభేదాలు తెరపైకొచ్చాయి. వేధిపుల ఆరోపణలతో చక్రి భార్య హెచ్చార్సీని ఆశ్రయించినా, ఆ తర్వాత మనసు మార్చుకున్నారు. చక్రి కుటుంబం తన కుటుంబమేననీ, వారి బాగోగులు తానే చూడాల్సి వుందని శ్రావణి అప్పట్లో వ్యాఖ్యానించారు.

ఇప్పుడేమో ఇలా పోలీసులను ఆశ్రయించడంతోపాటు, చక్రి మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆస్తి పంపకాలే వివాదానికి కారణమని తెలుస్తోంది. అదే సమయంలో, గత కొంతకాలంగా అవకాశాల్లేక, సక్సెస్‌లు లేక చక్రి ఆర్థికంగా ఇబ్బందుల్లో కూరుకుపోయాడన్నది ఓ కోణం. ‘ఇప్పుడిప్పుడే అవకాశాలొస్తున్నాయి.. ఆర్థికంగా ఇబ్బందులన్నీ తీరిపోతాయి..’ అని చక్రి తనతో చెప్పినట్లు శ్రావణి ఇదివరకే వెల్లడిరచారు. అలాగైతే ఆస్తి పంపకాల్లో సమస్యలేముంటాయన్నదీ ఇంకో ప్రశ్న.