Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఈ మ‌ల్టీస్టార‌రూ.. రీమేకేనా?

ఈ మ‌ల్టీస్టార‌రూ.. రీమేకేనా?

టాలీవుడ్‌లో మ‌రో మ‌ల్టీస్టార‌ర్ కు రంగం సిద్ధం అవుతోంది. ప‌వ‌న్ - వెంకీ ఓ మైగాడ్ కోసం జ‌ట్టు క‌డితే ఈసారి నాగార్జున‌, ఎన్టీఆర్‌లు మ‌రో రీమేక్ కోసం సై అంటున్నారు.!  ప‌రాయి క‌థ‌ల్ని మ‌న‌కు అనుకూలంగా మ‌ల‌చుకోవడంలో వంశీపైడిప‌ల్లి సిద్ధహ‌స్తుడే. ఫేస్ ఆఫ్ సినిమాని ఎవ‌డుగా మార్చుకొని హిట్ కొట్టాడు. 

ఎన్టీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యంతో ఓ క‌థ చెప్పి ఒప్పించాడు. అందులో నాగ్‌ది కీల‌క పాత్ర‌. అయితే ఈ క‌థ కూడా రీమేకే అని తెలిసింది. ఓ బాలీవుడ్ క‌థ‌ను చూసి స్ఫూర్తి పొంది రాసుకొన్న క‌థ అట‌. అయితే అపిషియ‌ల్ రీమేకా?  లేదంటే ఫేస్ ఆఫ్‌లా ఫ్రీమేకా??  అనేది మాత్రం తేలాల్సివుంది. ఎన్టీఆర్ సైడ్ నుంచి ఎలాంటి అభ్యంత‌రాలూ లేవు. ఇప్పుడు ఈ సినిమాని ఒప్పుకోవ‌ల‌సింది నాగార్జునే. 

కొత్త  త‌ర‌హా క‌థ‌ల‌కుప‌ట్టం క‌ట్టే నాగ్‌.... వంశీ చెప్పిన లైన్‌కి ఎలా స్పందిస్తాడో చూడాలి. ఈత‌రం ద‌ర్శ‌కుల‌తో, కథానాయ‌కుల‌తో క‌ల‌సి ప‌ని చేయ‌డానికి నాగ్ ఎప్పుడూ రెడీనే. అందుకే ఈ సినిమా ఆయ‌న ఒప్పుకోవ‌డం ఖాయ‌మే అని ఫిల్మ్‌న‌గ‌ర్ టాక్‌. ర‌భ‌స పూర్తయిన వెంట‌నే... వంశీ సినిమా ఉండే అవ‌కాశాలున్నాయి. మ‌రి సుకుమార్ సినిమా ఏం చేస్తాడో..??  ఒక‌వేళ రెండూ ఒకేసారి సెట్స్‌పైకి తీసుకెళ్లగ‌లిగితే, అందులో ఒక్క సినిమా అయినా ఈ యేడాది విడుద‌ల అవ్వడం ఖాయం. అంటే ఈ యేడాది ఎన్టీఆర్ నుంచి రెండు సినిమాలొస్తాయ‌న్నమాట‌. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?