పవన్‌-మహేష్‌.. వింటేనే వైబ్రేషన్స్‌!

పవన్‌కళ్యాణ్‌, మహేష్‌బాబు ఇప్పుడు తెలుగు సినిమా సింహాసనం కోసం పోటీ పడుతున్నారు. ఈ కాంబినేషన్‌లో సినిమా చూడాలనేది ఇరువురి అభిమానుల స్వప్నం. అది నిజమైనా లేకున్నా… కనీసం ఇద్దరూ ఒకే స్టేజీపై కలిసి కనిపించినా…

పవన్‌కళ్యాణ్‌, మహేష్‌బాబు ఇప్పుడు తెలుగు సినిమా సింహాసనం కోసం పోటీ పడుతున్నారు. ఈ కాంబినేషన్‌లో సినిమా చూడాలనేది ఇరువురి అభిమానుల స్వప్నం. అది నిజమైనా లేకున్నా… కనీసం ఇద్దరూ ఒకే స్టేజీపై కలిసి కనిపించినా కానీ ఫాన్స్‌కి కనుల పండగే. అది త్వరలోనే జరగనుందని బాగా ప్రచారం జరుగుతోంది. 

హుద్‌హుద్‌ తుఫాన్‌ బాధితుల సహాయార్థం తెలుగు సినీ పరిశ్రమ తరఫున చేయబోతున్న ‘మేము సైతం’ కార్యక్రమంలో మహేష్‌, పవన్‌ ఒక టాక్‌ షోలో పాల్గొంటారని, అది త్రివిక్రమ్‌ ఆధ్వర్యంలో జరుగుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంతనేది తెలియదు కానీ వినడానికే చాలా ఎక్సయిటింగ్‌గా ఉంది. 

ఇలాంటి కార్యక్రమాల్లో స్టేజ్‌పై డాన్సులు గట్రా చేయడం పవన్‌, మహేష్‌ ఇద్దరికీ అలవాటు లేదు. కానీ తాము కూడా ఏదైనా చేస్తే తప్పకుండా షోకి ఉన్న వేల్యూ మల్టిప్లయ్‌ అవుతుంది. ఇది దృష్టిలో ఉంచుకునే తమ స్నేహితుడు త్రివిక్రమ్‌ ప్రోద్బలంతో ఈ టాక్‌ షోకి అంగీకరించారని ప్రచారమవుతోంది. ఇదంటూ ఉంటే కనుక తప్పకుండా మేము సైతం షోకి ఇదే హైలైట్‌ అవుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు.