Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఫ్రెండ్ సినిమాకు డుమ్మా కొట్టిన మహేష్ బాబు

ఫ్రెండ్ సినిమాకు డుమ్మా కొట్టిన మహేష్ బాబు

సినిమాలు చూస్తున్నాడో లేదో తెలీదు కానీ,  సంక్రాంతి సినిమాలపై వరుసగా ట్వీట్స్ పెడుతున్నాడు మహేష్ బాబు. కథానాయకుడి నుంచి స్టార్ట్ చేసి నిన్న రిలీజైన ఎఫ్2 వరకు ప్రతి సినిమాను మెచ్చుకున్నాడు. అయితే ఈ లిస్ట్ లో వినయ విధేయరామ మాత్రం మిస్ అయింది.

ప్రస్తుతం మహర్షి సినిమా పనిలో బిజీగా ఉన్నాడు మహేష్. అయినప్పటికీ సంక్రాంతి సినిమాలపై వరుసగా రియాక్ట్ అవుతూనే ఉన్నాడు. కథానాయకుడు సినిమాను ఎన్టీఆర్ కు బెస్ట్ ట్రిబ్యూట్ గా చెప్పుకొచ్చాడు. కథానాయకుడు కంటే బెటర్ సినిమా ఏదైనా ఉందంటే అది మహానాయకుడు మాత్రమే అని మెచ్చుకున్నాడు.

ఆ మరుసటి రోజు పేట సినిమాను పొగిడాడు. రజనీ అభిమానులకు పేట సినిమా అంకితం అన్నాడు. రజనీకాంత్ ను పొగుడుతూనే సినిమా దర్శకుడ్ని, సినిమాటోగ్రాఫర్ ను మెచ్చుకున్నాడు. ఇక నిన్న రిలీజైన ఎఫ్2పై కూడా ప్రశంసలు కురిపించాడు మహేష్. వెంకీ, వరుణ్ తో పాటు కీలక సభ్యులందరికీ పేరుపేరునా శుభాకాంక్షలు చెప్పాడు.

ఇలా ప్రతి సినిమాపై వదలకుండా ట్వీట్ చేస్తున్న మహేష్.. పేట సినిమాకు, ఎఫ్2కు మధ్యలో విడుదలైన వినయ విధేయరామ సినిమాను మాత్రం మిస్ అయ్యాడు. సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతోనే మహేష్ రియాక్ట్ అవ్వకుండా సైలెంట్ అయ్యాడని కొందరు అంటుంటే... బిజీగా ఉండడం వల్లే చరణ్ సినిమాను మహేష్ చూడలేకపోయాడంటున్నారు మరికొందరు.

వరుసగా సినిమాలు చూస్తున్న మహేష్ కు వినయ విధేయరామ చూడ్డానికి టైమ్ దొరకలేదంటే నమ్మలేం. పైగా ఇది మహేష్ బెస్ట్ ఫ్రెండ్ చరణ్ సినిమా. ఇలాంటి మూవీని మహేష్ మిస్ అయ్యాడంటే అది అబద్ధమే అవుతుంది.

తన ఫ్రెండ్ చరణ్ నటించిన సినిమాను మహేష్ చూసే ఉంటాడు. కాకపోతే మూవీని మెచ్చుకుంటూ ట్వీట్ పెడితే ట్రోల్ అవుతాననే విషయం మహేష్ కు వెంటనే అర్థమైంది. అందుకే సైలెంట్ అయ్యాడేమో. ఇప్పుడు చెప్పండి.. మహేష్-బోయపాటి కాంబోలో సినిమా ఉంటుందంటారా?

తేలని అభ్యర్థుల ఎంపిక.. పవన్ కల్యాణ్ పనే హాయి!

NTR బయోపిక్ గురించి తెలియని విషయాలు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?