Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మళ్లీ అదే లైనా?

మళ్లీ అదే లైనా?

శుభం పలకరా అన్నట్లు అనిపిస్తుంది కానీ, లైన్ విన్నాక అలా అనక తప్పడం లేదు. గోపీచంద్ మలినేని బలుపు తరువాత మొత్తానికి మరో సినిమాకు శ్రీకారం చుట్టాడు. రామ్ హీరో. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. థమన్ సంగీత దర్శకుడు. ఈ సినిమాకు వెలిగొండ శ్రీనివాస్ కథకు, కోన వెంకట్ స్రీన్ ప్లే మాటలు అందిస్తే, అనిల్ రావిపూడి సహకారం అందించారు. 

ఇంతకీ ఈ సినిమా ప్రారంభ మీడియా సమావేశంలో రచయిత లైన్ చెప్పగానే అత్తారింటికి దారేది గుర్తుకు వచ్చింది జనాలకు. ఇంతకీ చెప్పిన లైన్ ఏమిటంటే, రచయిత మాటల్లోనే...'ఈ రోజుల్లో డబ్బు సంపాదన కోసం తమ వారి అందరినీ వదిలి జనం విదేశాలకు వెళ్తుంటే, ఓ మిలియనీర్ తన వాళ్ల కోసం విదేశాల నుంచి వచ్చి ఏం చేసాడన్నది' ఇలా చెప్పగానే ఎవరికైనా అత్తారింటికి దారేది గుర్తుకు రావడం సహజమే. ఆఫ్ కోర్స్..వారి కథ వేరే వుండి వుండొచ్చు. అది వేరేసంగతి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?