Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మరోసారి సుప్రీమ్ జోడీ?

మరోసారి సుప్రీమ్ జోడీ?

సుప్రీమ్ సినిమాలో పోటా పోటీగా నటించి, మెగాభిమానులకు కనువిందు చేసిన జోడీ సాయిధరమ్ తేజ్-రాశీఖన్నా. ఈ జోడీ మరోసారి స్క్రీన్ మీదకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. సాయిధరమ్ తేజ్ లేటెస్ట్ గా మారుతి డైరక్షన్ లో చేయాల్సిన సినిమాకు హీరోయిన్ ఎంపిక వ్యవహారం అలా కొన'సాగుతూనే' వుంది.

ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు ఇప్పటికే అనేకానేక పేర్లు వినిపించాయి. ఆఖరికి ఎబిసిడి సినిమా హీరోయిన్ రుష్కర్ థిల్లాన్ పేరు దాదాపు ఫైనల్ అయింది. కానీ కాస్త నోటెడ్ హీరోయిన్ వుంటే బెటర్ అని ఆది నుంచీ సలహాలు వినిపిస్తూనే వున్నాయి. ఎందుకంటే సాయిధరమ్ తేజ్ మార్కెట్ అంతంతమాత్రం. దానికితోడు నోటెడ్ హీరోయిన్ లేకుంటే, భారం అంతా డైరక్టర్ మారుతి మీదే పడుతుంది.

అందుకే రుష్కర్ పేరు ఫైనల్ లిస్ట్ లో అలావుంచి, మరోపక్క కాస్త రీజనబుల్ బడ్జెట్ లో ఎవరు దొరుకుతారా? అన్న వేట అలా సాగిస్తూనే వున్నారు. రాశీఖన్నా అంటే 75లక్షల రేంజ్ లో వుంటుంది రెమ్యూనిరేషన్. ఇప్పుడు అదే విషయమైన చర్చలు సాగుతున్నట్లు బోగట్టా. అవి ఒక కొలిక్కి వస్తే, తేజు-మారుతి సినిమాకు లేటెస్ట్ గా రాశీఖన్నా పేరు ఫైనల్ లిస్ట్ లోకి వస్తుంది.

ఆత్మవిమర్శ అవసరం.. దిక్కుతోచని స్థితిలోనే ఈ పనులు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?