ఎమ్మార్వోలపై చర్యలకు ఆదేశం?

సినిమా టికెట్ రేట్ల వ్యవహారం సీరియస్ టర్న్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని ఓ పక్క అడుగుతూ, చర్చలకు వస్తామని అంటూనే, మరో పక్క సైలంట్ గా పాత రేట్లు అమ్మేస్తున్నారు చాలా థియేటర్ల దగ్గర. …

సినిమా టికెట్ రేట్ల వ్యవహారం సీరియస్ టర్న్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని ఓ పక్క అడుగుతూ, చర్చలకు వస్తామని అంటూనే, మరో పక్క సైలంట్ గా పాత రేట్లు అమ్మేస్తున్నారు చాలా థియేటర్ల దగ్గర. 

లోకల్ అధికారులను మేనేజ్ చేస్తూ, జనాలకు కొత్త తగ్గింపు రేట్లు తెలియ చేయకుండా చాలా థియేటర్ల దగ్గర ఇలా చేయడం అన్నది సిఎమ్ పేషీ దృష్టికి కొందరు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

సి సెంటర్లలో ఇలాంటి వ్యవహారం ఎక్కువగా వుందని, నగరపంచాయతీలపై దృష్టి పెట్టి ఎమ్మార్వోలను కట్టడి చేయాలని జాయింట్ కలెక్టర్లకు సిఎమ్ పేషీ నుంచి ఆదేశాలు వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

అవసరం అయితే ఎక్కడ ప్రభుత్వ జీవో ఉల్లంఘించి పాత రేట్లు అమ్మేస్తున్నారో అక్కడి లోకల్ అధికారుల్లో బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోమని సిఎమ్ పేషీ నుంచి ఆదేశాలు వెళ్లాయని తెలుస్తోంది.

గత రెండు వారాల్లో విడుదలయిన చిన్న సినిమాల విషయంలో ఇలా చేయడం అన్నది కామన్ అయిపోయిందని, సిండికేట్ చేసి, థియేటర్లు చేతిలో వుంచుకున్న కొంతమంది సైలంట్ గా ఈ వ్యవహారానికి తెరతీసారని సిఎమ్ పేషీకి ఫిర్యాదు చేసారని వినిపిస్తోంది. 

ఇప్పుడు ఈ వ్యవహారం టికెట్ రేట్లపై జరిగే చర్చలను కూడా ప్రభావితం చేసే అవకాశం వుందని వినిపిస్తోంది. వ్యవహారం ఇంకా జగన్ దృష్టికి వెళ్లలేదని, వెళ్తే మొదటికే మోసం వస్తుందని సినిమా జనాలు కొందరు అభిప్రాయపడుతున్నారు.