జోరు మీదున్న ‘మాట్నీ’

ఘాజీ లాంటి మంచి సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చి మెగాస్టార్ తో ఆచార్య సినిమా భారీ లెవెల్ లో తీస్తున్న సంస్థ మాట్నీ ఎంటర్ టైన్ మెంట్. ఈ సంస్థ దాదాపు పది పదిహేను చిన్న…

ఘాజీ లాంటి మంచి సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చి మెగాస్టార్ తో ఆచార్య సినిమా భారీ లెవెల్ లో తీస్తున్న సంస్థ మాట్నీ ఎంటర్ టైన్ మెంట్. ఈ సంస్థ దాదాపు పది పదిహేను చిన్న సినిమాలు ప్లాన్ చేసింది.

ఒక్కొక్కటీ  రివీల్ చేసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఆచార్య సెట్ మీద వుంది. నాగార్జున వైల్డ్ డాగ్ పూర్తయింది. శ్రీవిష్ణుతో సినిమా ప్రారంభమైంది. 

ఇప్పుడు మరో సినిమా ప్రకటించారు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అందించిన స్వరూప్ డైరక్షన్ లో మళ్లీ మరో ఫన్ థ్రిల్లర్ ను అందించబోతున్నారు. దీని కోసం రూపొందించిన కాన్సెప్ట్ పోస్టర్ ఇంట్రస్టింగ్ గా వుంది.

ఆంజనేయడు, ఈశ్వరుడు, కృష్ణుడు గెటప్ లో వున్న పిలగాళ్లు చేతుల్లో గన్ లు పట్టుకున్నట్లుగా ఈ కాన్సెప్ట్ పోస్టర్ ను తయారుచేసారు. మిషన్ ఇంపాజిబుల్ టైటిల్ కూడా ఆసక్తికరంగా వుంది.

సినిమాలో ఈ ముగ్గురు పిలగాళ్ల క్యారెక్టర్లు కీలకం. వాళ్లతో పాటు హీరో, హీరోయిన్లు వుంటారు. ఈ సినిమా త్వరలో సెట్ మీదకు వెళ్తుంది. 

ఈ స్కీమ్ సఫలం అయితే ఎపి దేశానికి రోల్ మోడల్ అవుతుంది