ప్రాజెక్ట్ కె..ఆల్ మోస్ట్ పూర్తి!

ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్ భారీ సినిమా ప్రాజెక్ట్ కె. ఈ సినిమా మీద భారీ అంచనాలు వున్నాయి. సంక్రాంతి 2024 విడుదల అని డేట్ కూడా ఇచ్చారు.  Advertisement నిన్నటికి నిన్న ఈ సినిమా…

ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్ భారీ సినిమా ప్రాజెక్ట్ కె. ఈ సినిమా మీద భారీ అంచనాలు వున్నాయి. సంక్రాంతి 2024 విడుదల అని డేట్ కూడా ఇచ్చారు. 

నిన్నటికి నిన్న ఈ సినిమా షూట్ లో బాలీవుడ్ బాద్ షా అమితాబ్ బచ్చన్ గాయపడి, విశ్రాంతి తీసుకోవడానికి ముంబాయి వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి. దాంతో సినిమా విడుదల మీద ఫ్యాన్స్ కు టెన్షన్ మొదలైంది.

అయితే విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ పార్ట్ ఆల్ మోస్ట్ 90శాతం పూర్తయింది. అమితాబ్ పోర్షన్ ఓ పదిశాతం మినహా మొత్తం పూర్తయింది. మొత్తం ప్రాజెక్ట్ కె షూట్ ఏప్రిల్ ఆఖరికి అయిపోతుందని తెలుస్తోంది.

అయితే సిజి లు, ఎఫెక్ట్ పనులకు మాత్రం చాలా టైమ్ పడుతుందని కనీసం ఆరు నెలల సమయం అవసరం అని బోగట్టా. అందుకే ఈ పనులకే ఆరు నెలలు టైమ్ షెడ్యూలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఆదిపురుష్ మార్కెటింగ్ పనులు కూడా మొదలయ్యాయి. నైజాం డీల్ పూర్తయింది. ఓవర్ సీస్ డీల్ చర్చలు సాగుతున్నాయి. ఇన్ సైడ్ వర్గాల సమాచారం ప్రకారం ప్రాజెక్ట్ కె ఓ విజువల్ వండర్ గా వుండబోతోంది. ఇప్పటి నుంచీ బయటకు తెస్తే ప్రభాస్ మిగిలిన, ముందుగా విడుదలయ్యే సినిమాల మీద ప్రభావం పడుతుందని సైలంట్ గా వున్నారు మేకర్లు.