వైసీపీ ధ‌ర్నా.. ఇత‌ర పార్టీల రాక‌పై ఉత్కంఠ‌!

ఏపీలో అరాచ‌క పాల‌న‌ను యావ‌త్ దేశం దృష్టికి తీసుకొచ్చేందుకు వైసీపీ సంక‌ల్పించింది. ఈ సంద‌ర్భంగా ఢిల్లీలో 24న ధ‌ర్నా చేప‌ట్టాల‌ని వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నిర్ణ‌యించారు. అధికారాన్ని పోగొట్టుకున్న జ‌గ‌న్‌కు ఇత‌ర పార్టీల్ని క‌లుపుకెళ్లాలన్న స్పృహ…

ఏపీలో అరాచ‌క పాల‌న‌ను యావ‌త్ దేశం దృష్టికి తీసుకొచ్చేందుకు వైసీపీ సంక‌ల్పించింది. ఈ సంద‌ర్భంగా ఢిల్లీలో 24న ధ‌ర్నా చేప‌ట్టాల‌ని వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నిర్ణ‌యించారు. అధికారాన్ని పోగొట్టుకున్న జ‌గ‌న్‌కు ఇత‌ర పార్టీల్ని క‌లుపుకెళ్లాలన్న స్పృహ వ‌చ్చింది. ఇది మంచి ప‌రిణామం. అయితే వైసీపీ త‌న‌కు అవ‌స‌ర‌మైన‌ప్పుడు మాత్ర‌మే ఇత‌ర పార్టీల సాయం కోరుతోంది.

అటు వైపు నుంచి స్పంద‌న ఏంట‌నేది తెలియాల్సి వుంది. ఢిల్లీలో చేప‌ట్ట‌నున్న ధ‌ర్నాకు ఇత‌ర పార్టీల‌కు సంబంధించి ఎవ‌రెవ‌రిని ఆహ్వానిస్తున్నార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఇత‌ర పార్టీల‌ను కూడా ఆహ్వానిస్తామ‌ని ప్ర‌క‌టించ‌డం స‌రైందా? కాదా? అనే చ‌ర్చ కూడా లేక‌పోలేదు. ఒక‌వేళ ఇత‌ర పార్టీలేవీ రాక‌పోతే వైసీపీ అభాసుపాలు కావ‌డం ఖాయం.

ఎన్డీఏ కూట‌మి ప‌క్షాల్ని వైసీపీ ఆహ్వానించ‌లేదు. ఎందుకంటే ఆ కూట‌మే ఏపీలో అధికారం చెలాయిస్తోంది. ఇండియా కూట‌మితో జ‌గ‌న్‌కు సత్సంబంధాలు లేవు. ముఖ్యంగా కాంగ్రెస్‌ను ఆయ‌న తీవ్రంగా వ్య‌తిరేకిస్తారు. ఇండియా కూట‌మిలోని టీఎంసీ, డీఎంకే, శ‌ర‌ద్‌ప‌వార్ పార్టీల‌తో స‌న్నిహిత సంబంధాలే ఉన్నాయి. బీజేపీతో జ‌గ‌న్ చెట్ట‌ప‌ట్టాలేసుకుని తిరుగుతుండ‌డం వ‌ల్ల ఆయ‌న‌తో ఆ పార్టీలు క‌లిసొచ్చేందుకు ఏ మేర‌కు ఆస‌క్తి చూపుతాయనేదే ప్ర‌శ్న‌.

గ‌తంలో ఎప్పుడైనా జ‌గ‌న్ ఇత‌ర పార్టీల‌కు క‌ష్టం వ‌చ్చిన‌పుడు అండ‌గా నిలిచిన దాఖ‌లాలు లేవు. పైగా మోదీకి మ‌ద్ద‌తుగా ఒక‌ట్రెండు సంద‌ర్భాల్లో కాంగ్రెస్ నాయ‌కుల్ని విమ‌ర్శించ‌డానికి జ‌గ‌న్ వెనుకాడ‌లేదు. అందుకే జ‌గ‌న్ చేప‌ట్టే ధ‌ర్నాకు ఇత‌ర పార్టీల రాక‌పై ఉత్కంఠ నెల‌కుంది.

20 Replies to “వైసీపీ ధ‌ర్నా.. ఇత‌ర పార్టీల రాక‌పై ఉత్కంఠ‌!”

  1. జగన్ రాజధానిలొ, వీధి_రౌడీల_కొట్లాటలు గురించి, రాష్ట్రం పరువు తీయటం తప్ప ఏమీ సాధించడు. రాష్ట్రానికి, ఏదైనా ఒక్క ఉపయోగపడే పని అయినా చెయ్యడా?

  2. శరద్ పవార్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయా 😂 నీకు గతం గుర్తు లేదేమో 2011 లో అనుకుంటా శరద్ పవార్ ఆఫీస్ లోకి వెళితే ఎవరు రానిచ్చారు నిన్ను ఇక్కడికి బయటకు వేళ్ళు అని చెప్పే వీడియో 12 ఏళ్లు గా వైరల్ అవుతూనే ఉంది

  3. ఎవరెవరు పోతున్నారు ధర్నాకి? జగన్ – లక్ష కోట్లు దొబ్బేసిన కేసు నిందితుడు అవినాష్ రెడ్డి – బాబాయ్ ను లేపేసిన నిందితుడు మీలాంటి పనికిమాలిన మందను బయటే వదిలేసిన ఆ సీబీఐ వాళ్ళ ఆఫీసు ముందు మావాళ్ళు చెయ్యాలి రా ధర్నా!!

  4. ఎవరెవరు పోతున్నారు ధర్నాకి? జగన్ – లక్ష కోట్లు దొబ్బేసిన కే సు నిందితుడు అవినాష్ రెడ్డి – బాబాయ్ ను లేపేసిన నిందితుడు మీలాంటి పనికిమాలిన మందను బయటే వదిలేసిన ఆ సీబీఐ వాళ్ళ ఆఫీసు ముందు మావాళ్ళు చెయ్యాలి రా ధర్నా!

  5. వీడు అధికారంలో లేకపోతేనే ఆక్టివ్ గా ఉంటాడనుకుంటా…. సరే అటాగె కానీ తదాస్తు రా jaglak

    ఈ పిత్రే గాడు 2014-2019 అధికారంలో లేనప్పుడు ఇలానే అయిందానికి కానిదానికి అతి చేసి యాగీ చేశాడు 2019-2024 అధికారంలో ఉన్నప్పుడు చప్పుడు చేయకుండా తాడేపల్లి మహల్ లో పడుకున్నాడు

Comments are closed.