మరోసారి ఓటమిని ఒప్పుకున్న చంద్రబాబు

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అంటేనే అంతెత్తున ఎగిరిపడుతున్న చంద్రబాబు తన ఓటమిని మరోసారి అంగీకరించారు. వెయ్యిశాతం గ్యారెంటీ.. మనదే అధికారం అంటూ చెబుతూనే మరోవైపు తన అసమర్థతను బైటపెట్టుకున్నారు బాబు. మన గెలుపు గుర్రాలతో వైసీపీ…

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అంటేనే అంతెత్తున ఎగిరిపడుతున్న చంద్రబాబు తన ఓటమిని మరోసారి అంగీకరించారు. వెయ్యిశాతం గ్యారెంటీ.. మనదే అధికారం అంటూ చెబుతూనే మరోవైపు తన అసమర్థతను బైటపెట్టుకున్నారు బాబు. మన గెలుపు గుర్రాలతో వైసీపీ నేతలు టచ్ లోకి వెళ్తున్నారని తెలుస్తోంది అంటున్న చంద్రబాబు తాను ప్రతిపక్షంలో ఉండబోతున్నాననే విషయాన్ని అంగీకరించినట్టయింది.

సహజంగా అధికార పక్షంలోకే ప్రతిపక్షం నుంచి వలసలు ఉంటాయి. చంద్రబాబు చేసిన దుర్మార్గ రాజకీయాలతో ఐదేళ్లుగా ఎమ్మెల్యేల వలసలు మూకుమ్మడిగా, నిస్సిగ్గుగా జరిగాయి. ఇలాంటి రోజుల్లో కూడా పార్టీతో పాటు పదవులకూ రాజీనామా చేస్తేనే చేర్చుకుంటామని ఖరాఖండిగా చెప్పే జగన్ లాంటి నాయకులు నిజంగా అరుదు.

జగన్ సంగతి తెలిసి కూడా చంద్రబాబు భయంతో వణికిపోతున్నారు. తమ పార్టీలో గెలిచే నాయకులతో వైసీపీ నేతలు మంతనాలు జరుపుతున్నారేమోనని బాబు భయం. ఎలాగూ అధికారం దక్కదు, కనీసం సమీక్షలు జరుపుకోడానికైనా ఎమ్మెల్యేలు ఉండాలి కదా. అలా కూడా ఎమ్మెల్యేలు తన పక్షాన ఉండకుండా ఎక్కడ వైసీపీలోకి జంప్ అయిపోతారేమో అనేది బాబు భయం. వలసల్ని ఆపే శక్తి చంద్రబాబుకి లేదు, కనీసం వలసలపై మాట్లాడే అర్హత కూడా ఆయనకు లేదు. అందుకే ఫలితాలకు ముందే ఇలాంటి కుట్రల్ని ఆపాలి అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు.

తన పార్టీ నేతలపై వైసీపీ కన్నుపడిందని అన్నప్పుడే చంద్రబాబు ఓటమిని ఒప్పుకున్నట్టు లెక్క. అలా అధికారం వైసీపీదే అని ఒప్పుకుంటున్న చంద్రబాబు నూరుశాతం, వెయ్యిశాతం అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. అయితే ఇకపై రాష్ట్ర రాజకీయాలు చంద్రబాబు భయపడుతున్నట్టు మాత్రం ఉండవు అని చెప్పొచ్చు. హుందా రాజకీయాలు చేస్తున్న జగన్, టీడీపీ ఎమ్మెల్యేల జోలికి వెళ్లకపోవచ్చు.

ఎవరైనా వస్తానంటే పదవికి రాజీనామా చేసి రమ్మంటారు. ఎన్నికలంటే కోట్ల వ్యవహారం కాబట్టి, ఈ రోజుల్లో బైపోల్ కి ఎవరూ సిద్ధంగా ఉండరు. సో.. 2019 నుంచి ఏపీలో ఎమ్మెల్యేల కొనుగోళ్లు, అమ్మకాలు ఉండవనే అనుకోవాలి. 

మరీ దెబ్బతినని మోడీ ఇమేజ్… కోలుకున్నా పుంజుకోని కాంగ్రెస్!