రావ‌మ్మా రా…డ్ర‌గ్స్ కేసులో న‌టికి నోటీసులు

మొద‌టి నుంచి డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం చిత్ర ప‌రిశ్ర‌మ‌ను కుదిపేస్తోంది. అయితే విచార‌ణ సంద‌ర్భంలో చూపే చొర‌వ‌…ఆ త‌ర్వాత నెమ్మ‌దిగా నీరుగారి పోవ‌డం చూస్తూనే ఉన్నాం. బ‌హుశా ప్ర‌భుత్వంపై సినీ పెద్ద‌లు ఒత్తిడి కావచ్చు…ఇత‌ర‌త్రా కార‌ణాలు…

మొద‌టి నుంచి డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం చిత్ర ప‌రిశ్ర‌మ‌ను కుదిపేస్తోంది. అయితే విచార‌ణ సంద‌ర్భంలో చూపే చొర‌వ‌…ఆ త‌ర్వాత నెమ్మ‌దిగా నీరుగారి పోవ‌డం చూస్తూనే ఉన్నాం. బ‌హుశా ప్ర‌భుత్వంపై సినీ పెద్ద‌లు ఒత్తిడి కావచ్చు…ఇత‌ర‌త్రా కార‌ణాలు కావ‌చ్చు…సెల‌బ్రిటీల‌ను డ్రగ్స్ కేసులో అరెస్టు చేసిన దాఖ‌లాలు ఏమీ లేవు.

తాజాగా డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ‌ను వ‌ణికిస్తోంది. క‌న్న‌డ న‌టి రాగిణి ద్వివేదికి సెంట్ర‌ల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచార‌ణ‌కు రావాల‌ని ఆ నోటీసుల్లో ఆదేశించారు. ఈ సంద‌ర్భంగా జాయింట్ క‌మిష‌న‌ర్ ఆఫ్ పోలీస్ సందీప్ పాటిల్ మాట్లాడుతూ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు.

న‌టి రాగిణికి డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంతో సంబంధాలున్నాయ‌ని ప‌క్కా ఆధారాలు ఉండ‌డం వ‌ల్లే విచార‌ణ‌కు పిలిచామ‌న్నారు. ఇప్ప‌టికే ఈ కేసులో  రాగిణి స్నేహితుడు రవిని సిసిబి పోలీసులు అరెస్ట్‌ చేశారని గుర్తు చేశారు.  రాగిణికి కూడా డ్ర‌గ్స్ వ్య‌వ‌హారాల‌తో సంబంధా లున్న‌ట్టు  విచారణలో రవి చెప్పాడ‌న్నారు.  ఈ నేపథ్యంలోనే ఆమెకు సమన్లు జారీ చేసిన‌ట్టు ఆయ‌న‌ చెప్పారు.  రాగిణికి స‌మ‌న్ల జారీతో క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డింది.

వీడు అక్కయ్య వాడు అన్నయ్య

ప్రస్తుతం ఒక ట్రాప్ లో ఉన్నాను