ఆసీస్ చేతిలో భార‌త్ ఘోర ఓట‌మి!

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్ లో జ‌రిగిన‌ మూడో టెస్ట్ మ్యాచ్ లో భార‌త జ‌ట్టు ఘోర ప‌రాజ‌యం పాలైంది. రెండో ఇన్సింగ్స్ లో 76 ర‌న్స్ ల‌క్ష్యంతో బ‌రిలో దిగిన ఆసీస్…

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్ లో జ‌రిగిన‌ మూడో టెస్ట్ మ్యాచ్ లో భార‌త జ‌ట్టు ఘోర ప‌రాజ‌యం పాలైంది. రెండో ఇన్సింగ్స్ లో 76 ర‌న్స్ ల‌క్ష్యంతో బ‌రిలో దిగిన ఆసీస్ 9వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. 

మ్యాచ్ ఆరంభంలోనే ఆసీస్ ఖ‌వాజా(0) వికెట్ కోల్పోయిన‌ప్ప‌టికి హెడ్(49), ల‌బుషేన్(28) జోడీ దూకుడుగా ఆడి ఆసీస్ కు విజ‌యాన్ని అందించారు. దీంతో బోర్డ‌ర్- గ‌వాస్క‌ర్ ట్రోఫీ సిరీస్ లో భార‌త్ 2-1లీడ్ లో ఉంది.

ఇప్ప‌టికే తొలి రెండు టెస్టులూ మూడో రోజు ఆట పూర్తి కాకుండానే ఫ‌లితం వ‌చ్చాయి! మూడో టెస్టు ఫ‌లితం కూడా మూడో రోజే విజ‌యం తెలిసిపోయింది. ఇప్పటివరకు 14 సిరీస్ లు జరుగగా అందులో భారత్ 8 సార్లు గెలిస్తే, ఆస్ట్రేలియా 5 సార్లు నెగ్గింది, ఒక సిరీస్ 1-1తో డ్రా అయ్యింది.