Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆ క్రేజీ కాంబినేషన్ మైత్రీ దే

ఆ క్రేజీ కాంబినేషన్ మైత్రీ దే

మహెష్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్..ఎదురుచూస్తున్న క్రేజీ కాంబినేషన్. త్రివిక్రమ్-పవన్ సినిమా పూర్తి కావాలి..వంశీ పైడిపల్లి-మహేష్ సినిమా ఫినిష్ కావాలి. అప్పుడే ఈ సినిమా. అయితే ఈసారి త్రివిక్రమ్ ఈ సినిమాను హారిక హాసిని కోసం చేయబోవడం లేదు. 

మహేష్ కు శ్రీమంతుడు, ఎన్టీఆర్ కు జనతాగ్యారేజ్ లాంటి బంపర్ హిట్ లు ఇచ్చిన మైత్రీ మూవీస్ తోనే ఈ సినిమా వుంటుంది. వాస్తవానికి హారిక హాసినితో వుండేదే మిస్సయింది. మహేష్ దగ్గర వున్న అడ్వాన్స్  వెనక్కు తీసేసుకోవడంతో వాళ్లకు ఈ సినిమా లేకుండా అయిపోయింది. 

అందువల్ల మహేష్ ఈ సినిమాను మైత్రీ బ్యానర్ లోనే చేస్తారని తెలుస్తోంది. త్రివిక్రమ్, మహేష్ ల ఇండివిడ్యువల్ కమిట్ మెంట్లు పూర్తయ్యే లోగా రామ్ చరణ్ తో మైత్రీ సినిమా కూడా ఫినిష్ అవుతుంది. అప్పుడు ఈ క్రేజీ కాంబినేషన్ స్టార్ట్ అవుతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?