చ‌ర‌ణ్‌.. ఫుట్‌బాల్ ప్లేయ‌ర్‌

ధ‌ర‌ణి ద‌ర్శక‌త్వంలో న‌టించ‌డానికి రామ్‌చ‌ర‌ణ్ ఒప్పుకొన్నాడ‌న్న వార్త ఫిల్మ్‌న‌గ‌ర్‌లోచ‌క్కర్లు కొడుతోంది. వీరిద్దరి కాంబినేష‌న్లో ఇది వ‌ర‌కు.. మెరుపు అనే సినిమా మొద‌లై మ‌ధ్యలోనే ఆగిపోయింది. అలాంటిది.. మ‌ళ్లీ ధ‌ర‌ణికి ఎలా ఓకే చెప్పాడబ్బా???  అని…

ధ‌ర‌ణి ద‌ర్శక‌త్వంలో న‌టించ‌డానికి రామ్‌చ‌ర‌ణ్ ఒప్పుకొన్నాడ‌న్న వార్త ఫిల్మ్‌న‌గ‌ర్‌లోచ‌క్కర్లు కొడుతోంది. వీరిద్దరి కాంబినేష‌న్లో ఇది వ‌ర‌కు.. మెరుపు అనే సినిమా మొద‌లై మ‌ధ్యలోనే ఆగిపోయింది. అలాంటిది.. మ‌ళ్లీ ధ‌ర‌ణికి ఎలా ఓకే చెప్పాడబ్బా???  అని మెగా ఫ్యాన్స్ ముక్కున వేలేసుకొంటున్నారు. 

ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వార్త తెలిసింది. అదేంటంటే.. `మెరుపు` క‌థ‌కే మ‌ళ్లీ మెరుగులు దిద్ది… తీసుకొచ్చాడ‌ట ధ‌ర‌ణి. అప్పట్లో చ‌ర‌ణ్ చెప్పిన మార్పుల‌కు అనుగుణంగా ఈ క‌థ‌ని స‌మూలంగా మార్చి తీసుకొచ్చాడ‌ట‌.

 `మెరుపు`లో చ‌ర‌ణ్ ఓ ఫుట్ బాల్ ప్లేయ‌ర్‌. అందుకు సంబంధించిన కొన్ని స‌న్నివేశాల్ని అప్పట్లో తెర‌కెక్కించారు. వాటిని య‌ధావిధిగా వాడుకొనే అవ‌కాశం ఉంద‌ట‌. మొత్తానికి చ‌ర‌ణ్ పాత క‌థ‌కే ప‌డిపోయాడ‌ట‌న్నమాట‌. మ‌రి ధ‌ర‌ణి ఈసారైనా ఈ ప్రాజెక్టుని ఫుల్ ఫిల్ చేస్తాడో లేదో..??