లోఫర్ భామకు పెళ్లయిపోయింది?

మొన్నటికి మొన్న అనుష్క శర్మ, విరాట్ కోహ్లి సీక్రెట్ గా పెళ్లిచేసుకున్నారు. ఇప్పుడు ఇదే రూట్లో దిశా పటానీ కూడా సీక్రెట్ గా పెళ్లిచేసుకున్నట్టు పుకార్లు వస్తున్నాయి. పూరి జగన్నాథ్ డైరక్ట్ చేసిన లోఫర్…

మొన్నటికి మొన్న అనుష్క శర్మ, విరాట్ కోహ్లి సీక్రెట్ గా పెళ్లిచేసుకున్నారు. ఇప్పుడు ఇదే రూట్లో దిశా పటానీ కూడా సీక్రెట్ గా పెళ్లిచేసుకున్నట్టు పుకార్లు వస్తున్నాయి. పూరి జగన్నాథ్ డైరక్ట్ చేసిన లోఫర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ ను పెళ్లి చేసుకుందట. బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీష్రాఫ్ కుమారుడే ఈ టైగర్ ష్రాఫ్.

దాదాపు ఏడాదిగా టైగర్, దిశా ప్రేమించుకుంటున్నట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి. ముంబయిలో చాలా ప్రైవేటు పార్టీల్లో వీళ్లిద్దరూ గడిపిన క్షణాలు మీడియాకు కూడా చిక్కాయి. వీళ్లిద్దరూ కలిసి రెండేళ్ల కిందట బేఫికర్ అనే మ్యూజిక్ వీడియో చేశారు. అప్పట్నుంచి ఇద్దరూ ప్రేమించుకుంటున్నారట. తాజాగా పెళ్లి చేసుకున్నారంటూ పుకార్లు వస్తున్నాయి.

ప్రస్తుతం వీళ్లిద్దరు బాగి-2 సినిమా చేస్తున్నారు. ఈ మూవీ ప్రచారంలో భాగంగా ఈ పుకారు వచ్చిందా లేక నిజంగానే ఈ జంట పెళ్లి చేసుకుందా అనే విషయం తేలాల్సి ఉంది. వీళ్లిద్దరి ప్రేమ గురించి జాకీష్రాఫ్ కు ముందే తెలుసు.