పవన్.. త్రివిక్రమ్ లే ముఖ్య అతిధులు

అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్ మరో ఇరవై నాలుగు గంటల్లో జరగబోతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మహా ఉత్సాహంతో ఎదురుచూస్తున్న ఈవెంట్ ఇది. ఈ ఈవెంట్ కు ఎవరు వస్తారు? ఎవరు చీఫ్…

అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్ మరో ఇరవై నాలుగు గంటల్లో జరగబోతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మహా ఉత్సాహంతో ఎదురుచూస్తున్న ఈవెంట్ ఇది. ఈ ఈవెంట్ కు ఎవరు వస్తారు? ఎవరు చీఫ్ గెస్ట్ అనే దానిపై ఒకటి కాదు, రెండు కాదు చాలా ఊహాగానాలు వున్నాయి.

సాక్షాత్తూ మెగాస్టార్ చిరంజీవి వస్తారని కొందరు, కాదు, కాదు ఎన్టీఆర్ తో తివిక్రమ్ సినిమా వుంది కాబట్టి, ఆయనే వస్తారని మరి కొందరు. ఒకే ఫ్రేమ్ లో ఎన్టీఆర్-పవన్, లేదా పవన్-చిరు.. ఒహ్. .ఆ ఊహే మధురం అన్నట్లుగా వార్తలు వచ్చేస్తాయి ఇప్పటికే.

అయితే ప్రస్తుతానికి తెలుస్తున్న సమాచారం ప్రకారం అజ్ఞాతవాసి యూనిట్ సభ్యులు తప్ప, వేరే అతిధులు ఎవ్వరూ వుండరట. పవన్, త్రివిక్రమ్ మాత్రమే కీలకంగా వుంటారు. చాలా ఆడియో ఫంక్షన్ ల మాదిరిగా రికార్డింగ్ డ్యాన్స్ లు వుండనే వుండవట. దేశంలోని విభిన్న ప్రాంతాల నుంచి ఎంపికచేసి రప్పించిన కొన్ని ప్రధర్శనలు మాత్రం వుంటాయట.

కార్యక్రమం మరీ ఎక్కువ లెంగ్తీగా వుండకుండా, శీతాకాలాన్ని దృష్టిలో వుంచుకుని వీలయినంత త్వరగానే ముగిస్తారని తెలుస్తోంది. అలాగే కేవలం బ్యాలెన్స్ పాటలే తప్ప, ట్రయిలర్ విడుదల కూడా వుండదని టాక్.