రామ్‌ చరణ్‌ ముగిస్తాడు

ఈ ఏడాదిని ‘నాయక్‌’తో ఆరంభించిన రామ్‌ చరణ్‌ ‘ఎవడు’తో ముగించబోతున్నాడు. డిసెంబర్‌ 19న ఈ చిత్రం రిలీజ్‌ ఖరారు కావడంతో ఈ ఏడాదికి ఇదే లాస్ట్‌ బిగ్‌ రిలీజ్‌ అనుకోవచ్చు. ‘నాయక్‌’తో సూపర్‌హిట్‌ కొట్టి…

ఈ ఏడాదిని ‘నాయక్‌’తో ఆరంభించిన రామ్‌ చరణ్‌ ‘ఎవడు’తో ముగించబోతున్నాడు. డిసెంబర్‌ 19న ఈ చిత్రం రిలీజ్‌ ఖరారు కావడంతో ఈ ఏడాదికి ఇదే లాస్ట్‌ బిగ్‌ రిలీజ్‌ అనుకోవచ్చు. ‘నాయక్‌’తో సూపర్‌హిట్‌ కొట్టి ఈ ఏడాదిని మొదలు పెట్టిన చరణ్‌ అంతే ఘనంగా ముగిస్తాడో లేదో చూడాలి. 

ఎప్పుడో వేసవిలో విడుదల కావాల్సిన ‘ఎవడు’ వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఇప్పుడు డిసెంబర్‌ 19కి వచ్చింది. దీపావళికి విడుదల చేయాలనే ఒత్తిడి దిల్‌ రాజుపై ఉన్నా కానీ పెద్ద సినిమా విడుదలకి ఇది అంత అనువైన సమయం కాదని ‘ఎవడు’ రిలీజ్‌ని డిసెంబర్‌కి షిఫ్ట్‌ చేశాడు. 

‘ఎవడు’ హిట్‌ అయినట్టయితే అటు దిల్‌ రాజుకి కూడా ఈ ఏడాదిని ఘనంగా ఆరంభించి, అదే స్థాయిలో ముగించిన పేరొస్తుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో ఈ యేడాదిలో విజయాన్ని అందుకున్న దిల్‌ రాజుకి ‘రామయ్యా వస్తావయ్యా’తో చుక్కెదురైంది. అతని బ్యానర్‌ వేల్యూకి డ్యామేజ్‌ జరగకూడదంటే ఖచ్చితంగా ‘ఎవడు’ పెద్ద హిట్‌ అయి తీరాలి.