వినాయక్‌ సినిమా అమ్మేశారు!

శాటిలైట్‌ మార్కెట్లో పోటీ ఎంతలా పెరిగిపోయిందంటే… సినిమా మొదలవ్వకముందే రైట్స్‌ కోసం కర్చీఫ్లు పట్టుకొని రెడీ అయిపోతున్నారు. స్టార్‌ హీరోల సినిమాలకు ఈ డిమాండ్‌ మామూలే. కొత్త హీరో సినిమాకీ ఇలాంటి పోటీ నెలకొనడం…

శాటిలైట్‌ మార్కెట్లో పోటీ ఎంతలా పెరిగిపోయిందంటే… సినిమా మొదలవ్వకముందే రైట్స్‌ కోసం కర్చీఫ్లు పట్టుకొని రెడీ అయిపోతున్నారు. స్టార్‌ హీరోల సినిమాలకు ఈ డిమాండ్‌ మామూలే. కొత్త హీరో సినిమాకీ ఇలాంటి పోటీ నెలకొనడం ఆసక్తి కరం. 

బెల్లం కొండ సురేష్‌ తనయుడు సాయి శ్రీనివాస్‌ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా దసరా సందర్భంగా ప్రారంభమైంది.  కానీ షాకింగ్‌ న్యూస్‌ ఏమిటంటే ఈ సినిమా శాటిలైట్‌ హక్కులు ఆలెడీ అమ్ముడుపోయాయట.

 సన్‌ నెట్‌ వర్క్‌ ఈ సినిమా హక్కుల్ని రూ.4.5 కోట్లకు కొనుగోలు చేసిందని సమాచారవ్‌ు. ఓ కొత్త హీరో సినిమాకి ఈ స్థాయిలో డబ్బులు రావడం ఇదే తొలిసారి. అయితే వినాయక్‌, సమంతల మహత్య్యమూ ఉంది లెండి. మొత్తమ్మీద సాయి శ్రీనివాస్‌ తొలి అడుగులోనే మంచి బోణీ కొట్టాడు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.