Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వై... బాలయ్య దూరం దూరం

వై... బాలయ్య దూరం దూరం

పటాస్ అడియో ఫంక్షన్ కోసం నందమూరి అభిమానులు ఆశగా ఎదురుచూసారు. సినిమా మీద క్రేజ్ తో కాదు. నందమూరి నట వారసులు బాలయ్య బాబు, ఎన్టీఆర్ ఒక వేదికపై కనిపిస్తారని. సినిమాలో వీలయినంతగా బాబాయ్ బాలకృష్ణను పలవరించాడు కళ్యాణ్ రామ్. అందువల్ల అడియో ఫంక్షన్ కు గ్యారంటీ అప్పీయరెన్స్ వుంటుంది అనుకున్నారు. 

ఇక ఎన్టీఆర్ ఇటీవల తన తండ్రి, సోదరులతో కాస్త దగ్గరగా వుంటున్నాడు కాబట్టి అతగాడి హాజరు కూడా గ్యారంటీ అనుకున్నారు. అందువల్ల ఇక నందమూరి కుటుంబ సభ్యులు ఒక్క తాటిపైకి వస్తారని భావించారు. కానీ పటాస్ ఫంక్షన్ కు బాలయ్య బాబు రాలేదు. కళ్యాణ్ రామ్ పిలవకపోయి వుండొచ్చు అని అనుకోవడానికి లేదు. 

ఎందుకంటే సినిమాలోనే అంతలా కలవరించిన వాడు పిలవకుండా ఎందకు వుంటాడు. అంటే బాలయ్యే కావాలని వచ్చి వుండకపోవచ్చు. దీన్ని బట్టి అర్ధమవుతున్నది ఒకటే బాబాయ్..అబ్బాయ్ ల మధ్య దూరం ఇప్పట్లో తగ్గేలా లేదని.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?