ఎవడు యథాతథంగా..

‘ఎవడు’ చిత్రం విడుదల ఆలస్యమవుతున్న కొద్దీ దానిపై ఆసక్తి తగ్గిపోతూ వస్తోంది. ఈ చిత్రాన్ని దసరాకి రిలీజ్‌ చేయకుండా, ముందుగా ‘రామయ్యా వస్తావయ్యా’ని రిలీజ్‌ చేసిన దిల్‌ రాజు ఎవడుపై అనుమానాలు మరింతగా పెంచేశాడు.…

‘ఎవడు’ చిత్రం విడుదల ఆలస్యమవుతున్న కొద్దీ దానిపై ఆసక్తి తగ్గిపోతూ వస్తోంది. ఈ చిత్రాన్ని దసరాకి రిలీజ్‌ చేయకుండా, ముందుగా ‘రామయ్యా వస్తావయ్యా’ని రిలీజ్‌ చేసిన దిల్‌ రాజు ఎవడుపై అనుమానాలు మరింతగా పెంచేశాడు. ‘తుఫాన్‌’ పరాజయం తర్వాత ‘ఎవడు’కి రిపేర్స్‌ చేయాలని ఆలోచిస్తున్నారని కూడా టాక్‌ వినిపించింది. 

కానీ ‘ఎవడు’కి కొత్తగా ఎలాంటి రిపేర్లు ఉండవట. రీషూట్లు, ప్యాచ్‌ వర్క్‌లు ఏమీ చేయరట. ఎప్పుడు విడుదల చేసినా కానీ అప్పుడు సెన్సార్‌కి వెళ్లిన సినిమానే యథాతథంగా విడుదల చేస్తారట. ఎవడు అక్టోబర్‌ నెలాఖరులో విడుదల కావచ్చుననే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. 

రామయ్యా వస్తావయ్యా టాక్‌ వీక్‌గా ఉండడంతో దిల్‌ రాజు ‘ఎవడు’ని వెంటనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడని అంటున్నారు. ఒకవేళ అక్టోబర్‌ నెలాఖరుకి ఈ చిత్రం రిలీజ్‌ కాకపోతే కనుక డిసెంబర్‌ 19న రిలీజ్‌ అవుతుందట.