Advertisement

Advertisement


Home > Movies - Movie News

నాకు అందరి దిష్టి తగిలింది: మహేష్ బాబు

నాకు అందరి దిష్టి తగిలింది: మహేష్ బాబు

అందరికంటే ఎక్కువగా విహార యాత్రలకు వెళ్లే హీరోగా మహేష్ కు పేరుంది. టైమ్ దొరికితే కుటుంబంతో ఏదో ఒక దేశానికి రెక్కలు కట్టుకొని ఎగిరిపోతుంటాడు ఈ హీరో. ఇదే విషయంపై ఎన్టీఆర్, మహేష్ ను ప్రశ్నించాడు. సంవత్సరంలో 300 రోజులు వెకేషన్ కు వెళ్తావని, మిగతా రోజుల్లో మాత్రం షూట్ చేస్తావని ఫన్నీగా కామెంట్ చేశాడు. దీనిపై మహేష్ బాబు కూడా అంతే ఫన్నీగా రియాక్ట్ అయ్యాడు.

విహార యాత్రలకు సంబంధించి అందరి దిష్టి తనకు తగిలిందన్నాడు మహేష్. అందుకే రెండేళ్లుగా ఎక్కడికీ వెళ్లలేకపోయానని, కరోనా వల్ల ఇంట్లో కూర్చున్నానని సరదాగా వ్యాఖ్యానించాడు. తను ఎందుకు కుటుంబానికి అంత ప్రాధాన్యత ఇస్తాననే విషయాన్ని కూడా బయటపెట్టాడు.

"పిల్లలతో ఈ వయసులోనే గడపాలి. పెద్దయ్యేకొద్దీ వాళ్లకు ఫ్రెండ్స్ ఎక్కువవుతారు. అప్పుడిక మనతో గడపడానికి వాళ్లు ఇష్టపడరు. పైగా వాళ్లకు ఎక్కువ అవగాహన కల్పించాలంటే వివిధ ప్రాంతాలు చూపించాలి."

మహేష్ చెప్పిన సమాధానంతో ఎన్టీఆర్ కూడా ఏకీభవించాడు. మహేష్ ను చూసిన తర్వాత తన ఇంట్లో కూడా ఒత్తిడి పెరిగిందని చెప్పుకొచ్చాడు. ఇక సినిమాలపై స్పందిస్తూ.. ప్రస్తుతం చేస్తున్న సర్కారువారి పాట సినిమా పోకిరి సినిమా టైపులో ఉంటుందని చెప్పుకొచ్చాడు మహేష్. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?