సక్సెస్ ఇచ్చిన సంతోషం.. పార్ట్-3 కూడా

డీజే టిల్లూ బ్లాక్ బస్టర్ హిట్టయింది. దానికి సీక్వెల్ గా వచ్చిన టిల్లూ స్క్రేర్ ఈరోజు థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ సినిమాకు పార్ట్-3 కూడా ప్రకటించారు. Advertisement “నాకు…

డీజే టిల్లూ బ్లాక్ బస్టర్ హిట్టయింది. దానికి సీక్వెల్ గా వచ్చిన టిల్లూ స్క్రేర్ ఈరోజు థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ సినిమాకు పార్ట్-3 కూడా ప్రకటించారు.

“నాకు కొంతమంది మీడియా మిత్రులు, డిస్ట్రిబ్యూటర్లు ఐడియా ఇచ్చారు. కొద్దిసేపటి కిందటే నేను, సిద్ధు చర్చించుకున్నాం. వీలైనంత త్వరగా పార్ట్-3 తీద్దామని నిర్ణయించుకున్నాం. హీరో స్లో-మోషన్ మీద టిల్లూ-3 ఎనౌన్స్ చేస్తున్నాం. సోమవారం నుంచి ఈ ఎనౌన్స్ మెంట్ ప్రేక్షకులకు కనిపిస్తుంది.”

ఇలా టిల్లూ పార్ట్-3పై ప్రకటన చేశాడు నిర్మాత నాగవంశీ. టిల్లూ క్యారెక్టర్ ఫ్రాంచైజీ కిందకు వస్తుందని తను మొదట్నుంచి నమ్మానని, డిజే టిల్లూకు సీక్వెల్ చేయాలనే ఆలోచన కూడా తనదేనని, అదే ఇప్పుడు నిజమైందని అంటున్నాడు.

ఈ సినిమాకు మొదటిరోజు 25 కోట్ల రూపాల గ్రాస్ అంచనా వేస్తున్నాడు నాగవంశీ. ఒక్క నైజాం నుంచే 8-9 కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం ఉందని తెలిపిన నాగవంశీ.. రాబోయే రోజుల్లో టిల్లూ స్క్వేర్ కు మరిన్ని థియేటర్లు పెంచుతామని ప్రకటించాడు.

ఈ సినిమాలో సిద్ధూ పాత్రతో సమానంగా అనుపమ పరమేశ్వరన్ పోషించిన లిల్లీ పాత్రకు మంచి పేరొచ్చింది. కెరీర్ లో పెద్ద రిస్క్ చేశానని, అందుకు తగ్గ ప్రతిఫలం అందుకున్నట్టు తెలిపిన అనుపమ, పార్ట్-1లో రాధిక పాత్ర పోషించిన నేహా శెట్టి ఫోన్ చేసి మెచ్చుకోవడం బెస్ట్ కాంప్లిమెంట్ అని చెప్పుకొచ్చింది.