పూరీ జగన్నాథ్.. నెక్ట్స్ ఆ హీరోతోనా!

'ఇస్మార్ట్ శంకర్' తో ఫర్వాలేదనిపించుకునే విజయాన్ని సొంతం చేసుకున్న పూరీ జగన్నాథ్ తన తదుపరి సినిమాల విషయంలో ప్రయత్నాలు  మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగా లీకుల ద్వారా తదుపరి సినిమా విశేషాలను బయటకు వదులుతున్నారు.…

'ఇస్మార్ట్ శంకర్' తో ఫర్వాలేదనిపించుకునే విజయాన్ని సొంతం చేసుకున్న పూరీ జగన్నాథ్ తన తదుపరి సినిమాల విషయంలో ప్రయత్నాలు  మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగా లీకుల ద్వారా తదుపరి సినిమా విశేషాలను బయటకు వదులుతున్నారు.
 
తను గతంలో చేయాలనుకున్న ఒక సినిమాను పూరీ ఇప్పుడు పట్టాలెక్కించబోతున్నాడట. అయితే ఇప్పుడు హీరో కూడా మారిపోయినట్టుగా తెలుస్తోంది. 'బిజినెస్ మ్యాన్' పూర్తి అయినప్పుడే పూరీ 'జనగణమన' అనే సినిమా గురించి ప్రతిపాదించాడు. మహేశ్ తోనే ఆ సినిమాను చేయాలని అనుకున్నాడట ఈ దర్శకుడు. అయితే పూరీ ఫామ్ కోల్పోయి వరస ఫ్లాప్ లలో ఉన్ననేపథ్యంలో ఆ సినిమా ప్రతిపాదనను మహేశ్ పట్టించుకోలేదు.

ఈ క్రమంలో ఇప్పుడు తన సినిమాను మరో హీరోతో పట్టాలెక్కించబోతున్నాడట పూరీ. కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా ఆ సినిమాను రూపొందించాలని అనుకుంటున్నాడట. ఇటీవలే 'కేజీఎఫ్' తో యశ్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ సినిమాతో తెలుగుకు, బాలీవుడ్ కు కూడా పరిచయం అయ్యాడు.

ఈ క్రమంలో అతడు దాని సీక్వెల్ పార్ట్ చేస్తున్నాడు. పూరీకి ఇది వరకూ కూడా కన్నడ సినిమాలను రూపొందించిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో తన 'జనగణమన'ను యశ్ తో తీయాలనుకుంటున్నాడట పూరీ. కేజీఎఫ్ -2 షూటింగ్ పూర్తయ్యే వరకూ పూరీకి యశ్ డేట్స్ కేటాయించలేకపోవచ్చు