Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie News

శివకుమార్‌ దర్శకుడిగా '22'

శివకుమార్‌ దర్శకుడిగా '22'

వివిధ ప్రముఖ దర్శకుల దగ్గర పనిచేసిన శివకుమార్‌ బి. దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపేష్‌ కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా రూపొందనున్న చిత్రం '22'. ఈ చిత్రం బేనర్‌ లోగో, టైటిల్‌ ఎనౌన్స్‌మెంట్‌ కార్యక్రమం శనివారం జరిగింది. మా ఆయి ప్రొడక్షన్స్‌ బేనర్‌ లోగోను ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్‌ ఆవిష్కరించగా, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ టైటిల్‌ను ఎనౌన్స్‌ చేశారు. ఇంకా ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు మారుతి, ప్రముఖ నిర్మాత కొండా కృష్ణంరాజు అతిథులుగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ - ''శివ నా దగ్గర చాలా సినిమాలకు దర్శకత్వశాఖలో పని చేశాడు. తనంటే నాకు చాలా ఇష్టం. చాలా క్రమశిక్షణ, డెడికేషన్‌ ఉన్న వ్యక్తి. తనకి ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతల్ని అభినందిస్తున్నాను.  శివ తన టాలెంట్‌తో కథను రెడీ చేసుకొని నిర్మాతలని మెప్పించి ఈ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్‌ '22'. జూలై 22 నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపనున్నారు. శివ ఇండస్ట్రీలో చాలా పెద్ద దర్శకుడు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. 

దర్శకుడు మారుతి మాట్లాడుతూ - ''కొత్త డైరెక్టర్‌, కొత్త కాన్సెప్ట్‌తో ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా మీద ప్యాషన్‌తో ఓ వెబ్‌ సిరీస్‌కి దర్శకత్వం వహించి తన టాలెంట్‌ను ప్రూవ్‌ చేసుకొని మళ్లీ తననే హీరోగా పెట్టి సినిమా తీయడం అనేది సామాన్యమైన విషయం కాదు. శివ మా బేనర్‌లో కొన్ని సినిమాలకు వర్క్‌ చేశాడు. మంచి యాటిట్యూడ్‌ ఉన్న వ్యక్తి. ఈ '22' టైటిల్‌ చాలా ఇన్నోవేటివ్‌గా ఉంది టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు. 

ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్‌ మాట్లాడుతూ - ''ఈ రోజు జయ గారు ఎక్కడున్నా చాలా సంతోషిస్తారు. ఆమె డైరెక్టర్‌గా సినిమా తీయడం కన్నా.. శివ డైరెక్టర్‌ అవ్వాలనేది ఆమె కోరిక. శివ మా బేనర్‌లో ఎక్కువ సినిమాలు చేశాడు. ప్రొడ్యూసర్స్‌కి చాలా కంఫర్టబుల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శివలో మంచి స్పార్క్‌ ఉంది. చాలా తక్కువ టైమ్‌లో ఎక్కువ సినిమాలు చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అన్నారు. 

ప్రముఖ నిర్మాత కొండా కృష్ణంరాజు మాట్లాడుతూ - ''నేను, బి.ఎ. రాజుగారు స్వంత అన్నదమ్ముల్లాంటి వాళ్లం. ఈరోజు మా రాజుగారి అబ్బాయి శివ తనకు తానుగా స్వయంకృషితో వెబ్‌ సిరీస్‌ చేయడం, అది నిర్మాతకి నచ్చి తనతో సినిమా తీయడానికి ముందుకు రావడం చాలా సంతోషం. అలాగే జయగారి దీవెనలు ఎప్పుడూ శివకి ఉంటాయి'' అన్నారు. 

దర్శకుడు శివకుమార్‌ బి. మాట్లాడుతూ - '' మారుతి, పూరి జగన్నాథ్‌, వి.వి.వినాయక్‌గారి సినిమాలకి దర్శకత్వ శాఖలో పని చేశాను. అనుకోకుండా ఒకరోజు కొరియోగ్రాఫర్‌ ఆనీ మాస్టర్‌ నాతో నిర్మాత సుశీలాదేవిగారిని కలిసి కథ చెప్పమన్నారు. అప్పుడు నేను ముందుగా ఒక వెబ్‌ సిరీస్‌ చేద్దాం అన్నాను. అలా కథ నచ్చడంతో నాకు వెబ్‌ సిరీస్‌ చేసే అకాశం ఇచ్చారు.

అదే ప్రొడక్షన్‌లో నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చినందుకు థాంక్స్‌.  మా నాన్న బి.ఎ. రాజు నా అన్ని స్ట్రగుల్స్‌లో నాకు తోడుగా ఉంటూ, నన్ను ప్రతిక్షణం ముందుకు నడిపిస్తున్నారు. మా మమ్మీ జయగారి దగ్గర నేను ముందుగా ప్రొడక్షన్‌ నేర్చుకున్నాను. ఆ తర్వాత దర్శకత్వ శాఖలో మెళకువలు తెలుసుకున్నాను. మమ్మీ ఎక్కడున్నా.. ఆమె ఆశీస్సులు నాతోనే ఉన్నాయని నమ్ముతున్నా. 

రూపేష్‌ కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా, విక్రమ్‌జీత్‌ సింగ్‌, జయప్రకాశ్‌, రాజేశ్వరి నాయర్‌, రవివర్మ, అమిత్‌ తివారి, ఫిదా శరణ్య, మాస్టర్‌ తరుణ్‌ పవార్‌, బేబి ఓజల్‌ పవార్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: బి.వి. రవికిరణ్‌, సంగీతం: సాయికార్తీక్‌,  నిర్మాత: శ్రీమతి సుశీలాదేవి.

బాబుగారూ.. 'మీరు ఓడిపోవడం ఏమిటయ్యా!'

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?