తెలుసు కదా.. ఏకథాటిగా 30 రోజులు

సిద్ధు జొన్నలగడ్డ తన కొత్త సినిమాకు రెడీ అయ్యాడు. ఈసారి ఏకంగా 30 రోజుల కాల్షీట్లు కేటాయించాడు. నీరజ కోన దర్శకత్వంలో ‘తెలుసు కదా’ అనే సినిమా చేయబోతున్నాడు సిద్ధు. Advertisement వచ్చే నెల…

సిద్ధు జొన్నలగడ్డ తన కొత్త సినిమాకు రెడీ అయ్యాడు. ఈసారి ఏకంగా 30 రోజుల కాల్షీట్లు కేటాయించాడు. నీరజ కోన దర్శకత్వంలో ‘తెలుసు కదా’ అనే సినిమా చేయబోతున్నాడు సిద్ధు.

వచ్చే నెల 5 నుంచి ఏకథాటిగా ఈ సినిమా షూటింగ్ జరగనుంది. ఇందులో సిద్ధు జొన్నలగడ్డతో పాటు, హీరోయిన్లు రాశిఖన్నా, శ్రీనిధి శెట్టి కూడా పాల్గొంటారు. వీళ్లందరిపై టాకీతో పాటు, పాటలు కూడా షూట్ చేయబోతున్నారు. హైదరాబాద్ లోనే ఈ షూట్ జరుగుతుంది.

ఈ భారీ షెడ్యూల్ పూర్తయిన తర్వాత హీరో, డైరక్టర్, నిర్మాత అంతా కలిసి ఓసారి ఫూటేజ్ పై రివ్యూ చేసుకుంటారు. ఆ తర్వాతే నెక్ట్స్ షెడ్యూల్ ఏంటనేది ఫిక్స్ అవుతుంది. సిద్ధు జొన్నలగడ్డ విషయంలో రెగ్యులర్ గా ఇది జరిగేదే.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా ఈ సినిమా రాబోతోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. మూవీ షూటింగ్ కు సంబంధించి ఎలాంటి డెడ్ లైన్స్ పెట్టుకోలేదు. మంచి ఔట్ పుట్ వచ్చేంతవరకు షూట్ చేస్తారంట.

టిల్లూ స్క్వేర్ తో సిద్ధు జొన్నలగడ్డ పెద్ద హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఆ సక్సెస్ ను అతడు కొనసాగించాల్సిన అవసరం ఉంది. అందుకే నీరజ కోనపై ఒత్తిడి పెరిగింది.

7 Replies to “తెలుసు కదా.. ఏకథాటిగా 30 రోజులు”

    1. ఏ!!రా అసలు ఇంటికి కూడా వెళ్లకుండా ఇక్కడే బతికేస్తున్నావా….

      అక్కడ ఫుల్ బిజినెస్ నడుస్తుందా….

      అసలే పేటలో వినుకొండ రోడ్ బాగా ఫేమస్

      తొడుగుకి 1000 గి(ట్టు!బా)టు అవుతుందా…

Comments are closed.